కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందేలా సర్కారు ఉద్యానవన పంటలను ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే జిల్లాలో 1520 ఎకరాల్లో వివిధ రకాల పండ్ల తోటలు సాగవుతుండగా, ఈ ఏడాది మరో 85 ఎకరాల్లో వేసేలా ప్రణాళికలు రూపొందించింది. పనస, బొప్పాయి, జా మ, అరటి తదితరవాటిని సాగు చేసే వారికి 40 శా తం రాయితీ అందించనున్నది. అలాగే 1466 ఎకరాల్లో ఆయిల్ పామ్ విస్తరించాలని నిర్ణయించి, ఆ దిశగా చర్యలు చేపడుతున్నది.
నిరంతర ఆదాయ వనరులు..
సమీకృత వ్యవసాయ విధానాలతో రైతులకు ఉపయోగకరమైన, నిరంతర ఆదాయ వనరులను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు పడుతోంది. ఉ ద్యానవన శాఖ ద్వారా యేటా పండ్లతోటల విస్తరణ జరుగుతోంది. ప్రతి సంవత్సరం మామిడి, అరటి వంటి తోటలను విస్తరిస్తున్నారు. ఇలాంటి తోటలతో పాటు ఈ ఏడాది పనస, జామ, బొప్పాయి (పొప్పడి) పంటలను కూడా విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నారు. 2022-23 ఆర్థిక సవత్సరంలో జిల్లాకు 12.50 ఎకరాల అరటి, 2.50 ఎకరాల బొప్పాయి, 12.50 మామిడి, 10 ఎకరాల జామ, 25 ఎకరాల పనస తోటలను విస్తరించేందుకు రైతుల ఎంపిక ప్రక్రియను అధికారులు చేపడుతున్నారు. మిగతా సుమారు 20 ఎకరాల్లో ఇతర పండ్లతోటలను అభివృద్ధి చేయనున్నారు.
ఇప్పటికే 1520 ఎకరాల్లో సాగు..
జిల్లాలో ఇప్పటికే సాగువుతున్న 1520 ఎకరాల్లో రైతులు మామిడి, ఆపిల్, ఆపిల్బేర్, అరటి, దాని మ్మ, పుచ్చ తదితర పంటలను సాగుచేస్తున్నారు. వాణిజ్య పంటల వలన పెట్టుబడి భారం యేటా పె రుగుతుండడంతో ప్రభుత్వం ఉద్యాన వన పంటల సాగును ప్రోత్సహిస్తోంది. క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తూ పండ్లతోటలు సాగుచేసేలా చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో గతేడాది 122.50 ఎకరాల్లో పండ్లతోటలను సాగు చేసుకు న్న రైతులకు రాయితీలను ప్రోత్సాహకంగా అం దించారు. వీటితో రైతులు పండ్లమొక్కల సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ యేడు పండ్ల తోటలను 82 ఎకరాల్లో విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 1466 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలను విస్తరించేలా చర్య లు తీసకుంటున్నారు.
ఆసక్తి చూపుతున్న రైతులు..
జిల్లాలోని రెబ్బెన, సిర్పూర్-(టీ), దహెగాం, కెరమెరి, తిర్యాణి మండలాల్లో రైతులు ఎక్కువగా పండ్ల తోటల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయా రైతులకు మూడేళ్ల వరకు ఉద్యానవన శాఖ ద్వారా రాయితీలను ప్రభుత్వం అందిస్తోంది. మామిడి రైతులకు ఎకరానికి రూ. 58,452, జామ రైతులకు రూ. 76 ,112, సంత్ర రైతులకు రూ. 76,71, దానిమ్మ రైతులకు రూ. 91 ,474, బత్తాయి రైతులకు రూ. 69,547, సీతాఫలానికి రూ. లక్ష, సపోట రైతులకు రూ. 49,551, నేరేడు సాగుచేసే రైతులకు రూ. 31,719 ప్రభుత్వం మూడేళ్ల వరకు రాయితీ ద్వారా అందిస్తోంది. సూక్ష్మ సేద్య పథకం ద్వారా జిల్లాలో ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీపై సేద్యపు పరికరాలను కూడా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో అటవీ జాతి మొక్కలను సాగును విస్తరించేందుకు కూడా ప్రతేక దృష్టిని సారిస్తోంది. జిల్లాలో పండ్లతోటలతో పాటు అటవీ జాతి మొక్కల పెంపకం ద్వారా రైతులను ఉద్యానవన సాగువైపు వచ్చే విధంగా ప్రభుత్వం రాయితీల ద్వారా ఆకట్టుకుంటోంది.