ఇచ్చోడ( సిరికొండ) ఫిబ్రవరి 11: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు ఆదిలాబాద్ జిల్లాలోని జడ్పీ, కేజీవీబీ, మోడల్ స్కూళ్లు, గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ప్రత్యే శ్రద్ధ చూపుతున్నారు. ఏప్రిల్లో జరిగే పరీక్షలకు విద్యార్థులను ఆ దిశగా సన్నద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో జనవరి 1 నుంచి ప్రత్యేక తరగతులు తెలంగాణ ప్రభుత్వం ప్రా రంభించింది. స్కూళ్లలో ప్రతిరోజూ ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు సాయంత్రం 4: 30 నుంచి 5:30 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మొదటి ఫ్రీ ఫైనల్ పరీక్షలు ఈ నెల 21 నుంచి 27 వరకు ఉంటాయి. రెం డో ఫ్రీ పైనల్ మార్చి రెండో వారంలో ఉం టాయి. ఏప్రిల్ 3 నుంచి వార్షిక పరీక్షలు ప్రా రంభమవుతాయి. జిల్లావ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులు 6,947 ఉన్నారు. పాఠాలు అర్థం అవుతున్నాయా..? లేదా అని..? ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులకు అడిగి తెలుసుకుంటున్నా రు. అర్థం కాకపోతే మళ్లీ అవే పాఠాలు బో ధిస్తూ వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. తక్కువ మార్కులు వస్తున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.ఈ యేడాది ఆరు పేపర్లు మా త్రమే ఉంటాయని దీనిపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు..
ఉపాధ్యాయులు డిజిటల్, ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో వెనుకబడిన వారిని గుర్తించి ప్రోత్సహిస్తున్నారు. ఉపాధ్యాయుల సూచనలతో మంచి మార్కులు సాధిస్తానన్న నమ్మకం కలిగింది. పది జీపీఏ పాయింట్లు సాధించడమే లక్ష్యంగా చదువుతున్నాను.
–బొంత దీపిక, పదో తరగతి, ఆశ్రమోన్నత పాఠశాల మోడిగూడ, ఇచ్చోడ
వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తా..
ఉపాధ్యాయులు ప్రతిరోజూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పదో తరగతిలో మంచి మార్కులతో పాస్ అయి మంచి కాలేజీలో సీటు సాధించాలన్నది నా ధ్యేయం. తల్లిదండ్రులు, పాఠశాలకు మంచి పేరు తీసుకువస్తా. ఇందుకోసం ప్రతి రోజు ఉదయం 5 గంటలకు లేచి చదువుతున్నాను.
బీ.ప్రవీణ్, జడ్పీ ఉన్నత పాఠశాల, సిరికొండ
10 జీపీఏ సాధించడమే లక్ష్యం..
పది జీపీఏ సాధించడమే లక్ష్యంగా ప్రణాళికతో చదువుతున్నాను. ఇందు కోసం ఉదయం, రాత్రి సుమారు ఐదు గంటల సమయాన్ని కేటా యిస్తు న్నాను. 10 జీపీఏ సాధించి ట్రిపుల్ ఐటీలో సీటు సాధించడమే నా లక్ష్యం. సమయాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకుంటు న్నా. సందే హాలు ఉంటే టీచర్లను అడిగి నివృత్తి చేసుకుంటున్నా.
–రేణుక, కేజీబీవీ పాఠశాల, ఇచ్చోడ