రెబ్బెన, మార్చి 21 : పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్కుమార్ పేర్కొన్నారు. గురువారం రెబ్బెన మండలం గోలేటిటౌన్షిప్లో గల సీఈఆర్ క్లబ్లో కేంద్ర సాయుధ బలగాలకు ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు. అనంతరం పలు విషయాలపై వారికి అవగాహన కల్పించారు.
ఎన్నికల కమిషన్ సూచించిన గైడ్లైన్స్ ప్రకారం విధులు నిర్వహించాలని, ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర సాయుధ బలగాలు పూర్తి సహకారం అందించాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య, ఎస్బీ సీఐ రాణాప్రతాప్, రెబ్బెన సీఐ చిట్టిబాబు, ఎస్ఐ చంద్రశేఖర్ ఉన్నారు.