భూసారం తెలుసుకోవడానికి మట్టి పరీక్ష చేయాలి. పంట సాగు చేసే ముందు ప్రతి రైతు దీనిపై అవగాహన పెంపొందించుకోవాలి. ఒక పంట కోత ముగిసిన నెల రోజులకు మట్టి నమూనా సేకరించాలి. భూసార పరీక్ష వల్ల ఏ పంట వేయాలో తెలుస్తుంది. ఈ పరీక్ష చేయడం వల్ల అటు భూమి, ఇటు పంటకు శ్రీరామ రక్ష.
నార్నూర్, ఏప్రిల్ 23 : వ్యవసాయంలో పెట్టు బడులు తగ్గి, దిగుబడులు పెరగాలంటే భూసార పరీక్షలు తప్పనిసరి. వాస్తవానికి 90 శాతం రైతు లు పంటకు కావాల్సిన పోషక విలువలు తమ భూమిలో ఉన్నాయో లేదో తెలుసుకోకుం డానే పంటలు సాగు చేస్తున్నారు. దిగుబడుల కోసం రసాయన ఎరువులను విచ్చలవిడిగా వినియోగి స్తున్నారు. ఫలితంగా ఖర్చులు తప్ప, దిగుబడులు పెరుగడం లేదు. అంతే కాకుండా వేసిన ఎరువుల వల్ల భూమిలో సహజ సిద్ధంగా ఉండే పోషకాలు నశించిపోతున్నాయి.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయం లో అమలు చేస్తూ రైతులకు మెరుగైన దిగుబ డు లు సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం ముందు కెళ్తు న్నది. ఇందులో భాగంగానే మోతాదుకు మించి రసాయన ఎరువుల వినియోగాన్ని నియంత్రిం చడంతోపాటు రైతులకు పెట్టుబడి భారం తగ్గిం చేలా వ్యవసాయాధికారులు చర్యలు తీసుకుంటు న్నారు. భూసార పరీక్షల ఆధారంగా నేలలో ఉన్న పోషకాలను గుర్తించి, పంటల సాగు చేపట్టేలా రైతులను చైతన్య పరుస్తున్నారు. ఇందు కోసం జీపీఎస్ (గ్లోబల్ పొజిషినింగ్ సిస్టం)ద్వారా మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు నిర్వహి స్తున్నారు.
పంటల సాగులో అధిక దిగుబడులు సాధిం చాలనే తపనతో మోతాదుకు మించి వాడుతున్న రసాయనిక ఎరువుల వల్లే భూమిలోని పోషకాలు దెబ్బతింటున్నాయి. పొటాష్ను ఎక్కువగా వాడ డం వల్ల మెగ్నీషియం, జింగ్, ఇనుము వంటి సూక్ష్మపోషకాలు మొక్కకు అందకుండా పోతు న్నాయి. ఫలితంగా జింక్ లోపం వల్ల మొక్క ఎదు గుదల తగ్గి దిగుబడులపై ప్రభావం చూపుతు న్నది. సూక్ష్మస్థూల పోషకాలతో పాటు పీహెచ్ (నైట్రోజన్) సేంద్రియ కర్భనాల స్థాయి చాలా కీలకం. సేంద్రియ కర్భనం లోపిస్తే భూమి తన సహజ స్వభావాన్ని కోల్పోతుంది. ఎంత ఎరువు వేసినా భూమి గ్రహించకుండా నిస్సారమతుంది. భూమిలో సేంద్రియ కర్భనం 0.5 శాతం నుంచి 0.76 శాతం వరకు ఉంటే సాధారణంగా పరిగణి స్తారు. చాలా చోట్ల భూమిలో ఇది 0.1 శాతం నుంచి0.20 శాతం వరకు ఉన్నట్లు గత పరీక్షల ద్వారా తెలుస్తున్నది.
పొలంలో సేకరించిన మట్టిని ప్రయోగశాలలో భౌతిక, రసాయనిక పద్ధతుల్లో విశ్లేషించి, నేల స్వభావం, లక్షణాలు, పోషక విలువల స్థాయి గుర్తిస్తారు. ఈ ఫలితాల ఆధారంగా ఏ పంటకు ఎంత మోతాదులో పోషకాలు అవసరమో తెలు స్తుంది. దీంతో లోపించిన లవణాలను గుర్తించి దానికి అనుగుణంగా ఎరువులను వేసుకోవడం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. ప్రతి మూడేళ్ల కోసారి భూసార పరీక్షలు చేయించడం మంచిదని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
భూసార పరీక్షల ఆధా రంగా పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తా యి. భూసార పరీక్ష లు చేసి రైతులకు కార్డులు అందిస్తారు. ఈ ఏడాది కూడా వీటిపై రైతులకు అవ గాహన కల్పిస్తున్నాం. రసాయనిక ఎరువులు అధికంగా వాడడం వల్ల భూమిలో సారం తగ్గి పంట దిగుబడి తగ్గిపోతుంది.
– గిత్తే రమేశ్, వ్యవసాయ అధికారి(నార్నూర్)