శ్రీరాంపూర్, సెప్టెంబర్ 24: సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు దసరా అడ్వాన్స్ రూ.25 వేలు చెల్లించనున్నట్లు యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు కార్మికుల వేతనాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది.
పర్మినెంట్ కార్మికుడికి రూ.25 వేలు, ట్రైనింగ్, బదిలీ వర్కర్లుగా చేరిన కొత్త కార్మికులకు రూ.12,500 చెల్లించనున్నట్లు ప్రకటించింది. తిరిగి పది నెలల కాలంలో కార్మికుల వేతనాల నుంచి రికవరీ చేస్తామని పేర్కొంది.