కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేసినా ఆసిఫాబాద్ జిల్లాలో ఇసుక దందాకు అడ్డుకట్ట పడడం లేదు. ఇసుక మాఫియా ఇక్కడి వాగుల నుంచి నిత్యం వందల టన్నుల్లో హద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నది. రాజకీయ అండతోనే ఈ అక్రమ వ్యవహరం యథేచ్ఛగా సాగుతుండగా, ‘మాములు’గా తీసుకుంటున్న కిందిస్థాయి అధికారుల తీరు విమర్శలకు తావిస్తున్నది.
జిల్లాలోని రెబ్బన మండలంలోని గంగాపూర్, కాగజ్నగర్ మండలం రస్పల్లి, పెద్దవాగుల్లో దొరికే నాణ్యమైన ఇసుక అక్రమార్కులకు వరంగా మారింది. ఇక్కడి ప్రతిరో జూ వందల టన్నుల్లో పట్టణాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాజకీయ అం డదండలున్న కొందరు రెబ్బన మండలంలలోని లక్ష్మీపూర్, గంగాపూర్ వాగుల్లో జేసీబీల ద్వారా ట్రాక్టర్లలో ఇసుకను లోడ్చేసి సమీప ప్రాంతాల్లో డంపు చేస్తూ పొరుగు జిల్లాలు, పట్టణ ప్రాంతాలకు లారీల్లో తీసుకెళ్తున్నారు.
సమీపంలోని గ్రామాల్లో చేపట్టే నిర్మాణాలకు ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.2 వేల వరకు విక్రయిస్తున్నారు. జిల్లాలో కొద్దిరోజులుగా టాస్క్ఫోర్స్, మైనింగ్ అధికారు లు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందు కు ఆకస్మిక దాడులు చేస్తున్నారు. ఇటీవల టాస్క్ఫోర్స్ అధికారులు రెబ్బన మండలం లో జరిపిన దాడుల్లో దాదాపు 300 ట్రాక్టర్ల ఇసుక డంపులను పట్టుకొని లారీని స్వాధీ నం చేసుకున్నారు. అయినప్పటికీ అక్రమార్కులు బెదరడంలేదు. ప్రతిరోజూ వాగుల నుంచి ఇసుకను తోడేస్తూనే ఉన్నారు.