తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు మే 13న ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం పంపిణీపై పోలీసుల నిఘా పెరిగింది. అనేక ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయగా, 24 గంటల పాటు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పోలీస్ యంత్రాంగం సన్నద్ధతపై రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
పార్లమెంట్ ఎన్నికలు పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. మంచిర్యాల జిల్లాలో సాగుతున్న అక్రమదందాలపై ఉక్కుపాదం మోపుతామని, ఎంత పెద్దవారైనా సరే వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
– మంచిర్యాల, మార్చి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నమస్తే : పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎన్నికల కోసం పోలీస్ యంత్రాంగం సన్నద్ధత ఎలా ఉంది?
సీపీ : పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా యి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. పార్లమెంట్ పరిధిలో సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేందాలు 104 వరకు ఉన్నట్లు గుర్తించాం.
మహారాష్ట్ర బార్డర్లో ప్రాణహిత నదీ తీరం పక్కనున్న కోటపల్లి, నీల్వాయి, వేమనపల్లి, నెన్నెల ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఉన్నా యి. ఈ సమస్యాత్మక ప్రాంతాలన్నింటినీ ఇప్పటికే విజిట్ చేశాం. ప్రాణహిత బార్డర్తో మహారాష్ట్రలోని గడ్చిరోలి ఏరియా వరకు వెళ్లాం. ప్రాణహితపై 12 ఫెర్రీ పాయింట్స్ (నది దాటుకొని మన ఏరియాలోకి వచ్చేందుకు అవకాశం ఉన్నవి) ఉన్నాయి. వాటన్నింటినీ చెక్ చేశాం. ఆ రూట్స్ ద్వారా ఎవరు తెలంగాణలోకి ప్రవేశించినా వెంటనే మాకు తెలుస్తుంది.
సీపీ : ఎన్కౌంటర్తో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. మన నిఘా వ్యవస్థ ఇచ్చిన సమాచారంతోనే వారిని గడ్చిరోలి పోలీసులు ట్రాక్చేశారు. ప్రాణహిత నదీ తీరం వెంట ఏ గ్రామాల్లో మావోయిస్టులు షెల్టర్ తీసుకుంటారు. వాళ్ల వస్తువులు డంప్ చేసుకొని వెళ్తారనే సమాచారం ఉందో ఆయా గ్రామాల్లో ఇప్పటికే కార్డన్ సెర్చ్ పూర్తిచేశాం. అక్కడ ఏం జరిగినా మాకు సమాచారం వచ్చేలా ఏర్పాట్లు ఉన్నాయి. పైగా బార్డర్లో పెద్ద డ్రోన్ కూడా ఉంది.
పిన్ పాయింటెండ్ లొకేషన్ను సైతం అది ట్రాక్ చేయగలదు. కిలోమీటరున్నర ఎత్తులో దాన్ని ఆపరేట్ చేయొచ్చు. ఏకే-47తో కాల్చిన దాన్ని కొట్టడానికి రాదు. ఆ డ్రోన్కు హై రిజల్వేషన్ కెమెరాలు ఉన్నాయి. వాహనం, మనషులను సైతం అది ట్రాక్ చేస్తుంది. సీపీ ఆఫీసులో కూర్చొని అక్కడ ఏం జరుగుతుందో చూసేలా అది పని చేస్తుంది. ఇక థిక్ ఫారెస్ట్లో స్పెషల్ పార్టీలను డిప్లాయ్ చేశాం. ప్రాణహితకు సౌత్ సైడ్ ఒక పార్టీ, నార్త్ సైడ్ ఒక పార్టీ మొత్తం 25 కిలోమీటర్ల వరకు నిత్యం తిరుగుతున్నాయి.
మావోల ఎన్కౌంటర్లో మంగి-ఇంద్రవెల్లి డివిజన్ కమిటీ సెక్రటరీ, సిర్పూర్- చెన్నూర్ డివిజన్ కమిటీ సెక్రటరీలు ఇద్దరు సహా మరో ఇద్దరు కీలకమైన మావోయిస్టులు మృతి చెందారు. దీంతో ఆ రెండు దళాలు పూర్తి గా పోయాయి. కొన్ని రోజుల క్రితం గడ్చిరోలి అధికారులతో ఒక మీటింగ్ పెట్టాం. అది చాలా బాగా ఉపయోగపడుతుంది. రానున్న రోజుల్లో మహారాష్ట్ర పోలీసుల సహాకారంతో ముందుకు వెళ్తాం.
సీపీ : అవును.. మంచిర్యాల ఏరియాకు ఒక కంపెనీ వచ్చింది. ఈ మేరకు మంచిర్యాలలో గతంలోనే ఫ్లాగ్మార్చ్ కూడా అయిపోయింది. గోదావరిఖనికి సంబంధించి రెండో కంపెనీ కూడా వచ్చింది. ఒక్కో కంపెనీలో 90 నుంచి 91 మంది ఆర్మ్డ్ వెపన్స్ కలిగిన ఫోర్స్ ఉంది. అవసరాన్ని బట్టి మరిన్ని బలగాలను, సివిల్ ఫోర్స్ను వాడుకుంటున్నాం. అలాగే ప్రాణహిత బార్డర్లో స్పెషల్ పార్టీలు సైతం రోజూ తిరుగుతున్నాయి. 6 పార్టీలు కేవలం బార్డర్ వెంటే మోహరించి ఉన్నాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.
సీపీ : మొత్తం పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 21 ఎస్ఎస్టీ (స్ట్రాటిక్ సర్వేలైన్ టీమ్)లు చెక్పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతానికి సివిల్ ఫోర్స్తో వాటిని నడిపిస్తున్నాం. కంపెనీల నుంచి వచ్చిన సిబ్బంది ప్రస్తుతం సబ్ డివిజన్లోని క్రిటికల్ పోలింగ్, మావోయిస్టు ఎఫెక్టెడ్ పోలింగ్ సెంటర్లలో తిరుగుతున్నారు. వారికి మన ప్రాంతంపై సంపూర్ణమైన అవగాహన వచ్చాక 29వ తేదీ నుంచి ఎస్ఎస్టీ బాధ్యతలు అప్పగిస్తాం. ఇక ప్రతి రోజూ ఐడీ లిక్కర్, ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ పట్టుకుంటున్నాం. ఇప్పటి వరకు లక్షల రూపాయాల క్యాష్ కూడా సీజ్ చేశాం. ఇక ఒటర్లను ప్రలోభాలకు గురిచేసే గిప్టులవంటివి ఏం రాలేదు. బైండోవర్స్ అవుతున్నాయి. ప్రతి రోజూ 15 నుంచి 20 మంది వివిధ కేసుల్లో వచ్చి బైండోవర్ అవుతున్నారు. నాన్ బెయిలెబుల్ ఆర్డర్స్ కూడా అవుతున్నాయి. లైసెన్సుడ్ వెపన్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని అందిరికీ సూచించాం. అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పకడ్బందీగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తాం.
సీపీ : నేను సీపీగా బాధ్యతలు తీసుకున్న దగ్గరి నుంచి పీడీఎస్ బియ్యం ప్రతి రోజూ పట్టుకుంటున్నాం. కేసులు కూడా పెడుతున్నాం. రేషన్ బియ్యం ఎవ్వరూ తినడం లేదని, అందుకే తరలిస్తున్నారని తెలిసింది. గవర్నమెంట్ ఇచ్చిన బియ్యా న్ని తినకుంటే ఇష్టం వచ్చినట్లు దోచుకుపోతాం అనడం సరికాదు. సివిల్ సైప్లెయ్ అధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టా లి. సివిల్ సైప్లెయ్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఎమైనా ఫిర్యాదులు ఇస్తే వెంటనే కేసులు పెడతాం. ఇప్పటి దాకా పీడీఎస్పై 60 నుంచి 70 కేసులు నేను వచ్చాకే అయ్యాయి. ఇక ఇసుక అక్రమ రవాణాపై సైతం కేసులు కూడా పెడుతున్నాం. రెవెన్యూ, మైనింగ్ అధికారులకు దీనిపై పూర్తి బాధ్యత ఉంటుంది. నిబంధనలు అతిక్రమిస్తే ఎవ్వరైనా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.
సీపీ : ఈ మధ్య కాలంలో చిట్ఫండ్ లో మోసపోయిన వారు వచ్చి కలిశా రు. ఎవరైనా సరే చిట్ఫండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం నడుచుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తప్పకుండా పీడీ యాక్ట్ పెడుతాను. వాడు ఒక్కడు కా నీ, వంద మంది కానీ. పెద్దోళ్లు కానీ, చిన్నో ళ్లు కానీ చట్టం ముందు అందరూ సమానమే. నాకు తెలిసింది ఏమిటంటే సింగరేణి, ఎన్టీపీసీలో పని చేసే ఉద్యోగులకు అధిక మొత్తాలు ఫైనాన్స్ ఇస్తున్న కొం దరు ఉద్యోగుల ఏటీఎం కార్డులు తీసుకొని దగ్గర పెట్టుకుంటున్నారట. జీతం పడిందని వచ్చి ఉద్యోగులు చెప్పగానే ఆ నెల ఈఎంఐకి సరిపడా విత్డ్రా చేసుకొ ని మిగిలింది ఉద్యోగులకు ఇచ్చి పంపిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటివి ఏమైనా నా నోటీస్కు వస్తే మొత్తం దుకాణమే బంద్ చేస్తా. ఐపీసీ, పీడీ యాక్ట్ కింద కేసులు పెడుతాం. ఒక్క ఫిర్యాదు వచ్చి నా చాలు కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇది నా హెచ్చరికగా అందరికీ చెప్తున్నా..
సీపీ : నాన్ లే-అవుట్స్, భూముల ఆక్రమణలతో చాలా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే అంత సీరియస్ వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. ఎవ్వరైనా సరే అప్రూవుడ్ బై డీటీసీపీ లేకపోతే ఆ లే-అవుట్ ప్లాట్స్ కొననే కొనొద్దు. అది పూర్తిగా ఇల్లీగల్. ఫామ్ ల్యాండ్స్ క్రయవిక్రయాలు సైతం ఇల్లీగలే. ఇదో పెద్ద దం దా నడుస్తుందని తెలుస్తుంది. ఇలాంటి కేసుల్లో ఎవ్వరు మోసం చేసిన ఫిర్యాదు చేయండి. వెంటనే చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో ఎవ్వరికీ మినహాయింపు లేదు.
సీపీ : మీరన్నంత తీవ్రంగా కాకపోయినా గంజాయి ప్రాబ్లమ్ ఉంది. యువ త ఎక్కువగా గంజాకు అడిక్ట్ అవుతున్నారు. అయితే గంజా ఎక్కడి నుంచి వస్తుందనే సోర్స్ కోసం చూస్తున్నాం. ఇప్పటికే మా టీమ్ వర్కవుట్ చేస్తుంది. కొందరిని గుర్తించాం. పక్క జిల్లాల్లోని డీప్ ఏరియాలో పండించే వాళ్లు ఉన్నా రు. అక్కడి నుంచి మనకు వస్తుంది. వాడుతున్న వారిని పట్టుకుంటే ఉపయోగం లేదు. అందుకని వాళ్లకు స్టాక్ సప్లయ్ చేసే వాళ్లపై దృష్టి పెడుతున్నాం. మెయిన్ సోర్స్ కటాఫ్ చేస్తే వాడకం తగ్గుతుంది. యువతను దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు సైతం ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాం.