మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 29 : ఆస్తిపన్ను బకాయిదారులకు సర్కారు శుభవార్త చెప్పింది. 2023 వరకు మున్సిపాలిటీలకు చెల్లించాల్సిన ఆస్తిపన్ను బకాయిలపై విధించిన వడ్డీని 90 శాతం మాఫీచేస్తూ నిర్ణయం తీసుకుంది. పాతబకాయిలన్నీ ఒకేసారి చెల్లిస్తేనే.. ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఈ నిర్ణయంతో 2023 మార్చి వరకు ఉన్న ఆస్తిపన్ను బకాయిలపై విధించిన వడ్డీని కేవలం 10 శాతం మాత్రమే చెల్లిస్తే చాలు. ఇప్పటికే బకాయిలపై వడ్డీ మొత్తం చెల్లించిన వారికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో విధించే ఆస్తిపన్నులో 90 శాతం వడ్డీ మొత్తాన్ని రాయితీగా అందించనున్నది. దీంతో మున్సిపాలిటీలకు బకాయిపడ్డ చాలా మంది భవన యజమానులకు కాస్త ఊరట లభించనున్నది. మంచిర్యాల మున్సిపాలిటీలో పాతబకాయిలు రూ. 4.16 కోట్లు ఉండగా, దానిపై వడ్డీ రూ. 2.79 కోట్లు ఉన్నది.
ఆస్తిపన్ను వసూలుకు కేవలం నెలరోజులే మిగిలిఉంది. ఇప్పటివరకు కేవలం 46.92 శాతం ఆస్తిపన్ను మాత్రమే వసూలు చేశారు. మంచిర్యాలలో 26718 భవనాలు ఉండగా, వాటిలో 1665 మిక్స్డ్ (నివాస, వాణిజ్య ), 1397 నాన్ రెసిడెన్స్. 23656 నివాస భవనాలు ఉన్నాయి. వీటిద్వారా ఈ ఏడాదికి సంబంధించి ఆస్తిపన్నురూ. 10.62 కోట్లు రావాల్సి ఉంది. ఈ ఏడాదికి సంబంధించి జరిమానా రూపే ణా రూ. 51.62 లక్షలు, పాత బకాయిలు రూ. 4.16 కోట్లు, పాతబకాయిలపై వడ్డీ రూ. 2.79 కోట్లు కలిపి మొత్తం రూ. 18.09 కోట్లు వసూలు చేయడం లక్ష్యంగా ఉంది. ఇందులోనుంచి ఇప్పటివరకు ప్రస్తు త సంవత్సర ఆస్తిపన్ను రూ. 6.79 కోట్లు, ప్రస్తుత ఏడాది పన్నుపై వడ్డీ రూ. 14.2 లక్షలు, పాతబకాయిలు రూ. 1.15కోట్లు, పాతబకాయిలపై వడ్డీ రూ. 40.43 లక్షలు కలిపి మొత్తం రూ. 8.49 కోట్లు మాత్రమే వసూలు చేశారు. ఇంకా రూ. 9.60 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.
మంచిర్యాల మున్సిపాలిటీలో ఆస్తిపన్నుల వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఆస్తిపన్ను వసూ ళ్ల కోసం అన్ని వార్డులకు సిబ్బందిని నియమించారు. ఉదయం ఏడుగంటలనుంచి సాయం త్రం ఆరుగంటల దాకా పన్ను వసూళ్లు చేపడుతున్నారు. ఆటోలు, కేబుల్ టీవీల్లో పన్నులు చెల్లించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. లక్షకు పైగా ఆస్తిపన్ను కట్టాల్సి ఉన్న 100 మంది భవన యజమానుల లిస్టును తయారు చేశారు. వీరికి ప్రతిరోజూ మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్యతోపాటు కమిషనర్ మారుతీప్రసాద్, రెవె న్యూ ఆఫీసర్ శ్రీనివాస్రెడ్డి, సిబ్బంది ప్రత్యేకంగా ఫో న్లు చేస్తున్నారు. పన్ను చెల్లించాలని కోరుతున్నారు. మొండి బకాయిదారులను గుర్తించి.. రెడ్ నోటీసులు అందించారు. పన్ను చెల్లించకుంటే ఇళ్లల్లోకి వచ్చి విలువైన వస్తువులు జప్తు చేస్తామని చెబుతున్నారు.