నిర్మల్ అర్బన్, అక్టోబర్ 9 : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందకు పైగా సీట్లు సాధిస్తామని రాష్ట్ర అట వీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మం త్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని వార్డు 9 లో రూ.35 లక్షలు, 29కి రూ.30 లక్షలు, 31కి రూ. 40 లక్షలు, వార్డు 29కి రూ.30 లక్షలు, వార్డు 34కి రూ.35 లక్షల నిధులతో అలాగే వార్డు నంబర్ 27,28,39,40,42 వార్డుల్లో రూ. 1.60 లక్షలతో, బ్రహ్మపురి కాలనీలో 6,7,8,26, వార్డులకు సంబంధించి రూ.1. 60 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు సోమవారం భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ నవంబర్లో జరగనున్న ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నిర్మల్ మున్సిపాల్టీని రూ.75 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి చేసే పార్టీలకే ఓట్లు అడిగే అర్హత ఉంటుందని, మళ్లీ బీఆర్ఎస్ను ఆదరించాలని ఆయన కోరారు. అనంతరం మంత్రిని పలువురు ఘ నంగా సన్మానించారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు గండ్రత్ రమణ, తౌహీద్ ఉద్దీన్, రాజేశ్వర్, అడ్ప విజయలక్ష్మి పోశెట్టి, శ్రీకాంత్ యాదవ్ మున్సిపల్ కమిషనర్ రాజు తదితరులు ఉన్నారు.
నిర్మల్ పట్టణంలోని శాంతినగర్ క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన పీవీ నర్సింహారావు కాంస్య విగ్రహాన్ని రా జ్యసభ ఎంపీ కేశవరావుతో కలిసి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయుల అడుగు జాడల్లో నడవాలని వారి ఆశయ సాదనకు కృషి చేయాలని అన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, రైతు బందు సమితి అధ్యక్షులు వెంకట్ రాం రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు తదితరులున్నారు.
నిర్మల్ నియోజికవర్గంలోని వివిధ కులాలకు రూ.12 కోట్ల నిధులతో నిర్మించనున్న 216 కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి మంజూరు పత్రాలను దివ్యనగర్ కాలనీలోని దివ్య గార్డెన్లో కుల సంఘాల సభ్యులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అందజేశారు.
అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో బీఆర్ఎస్ సైనికులు ఎన్నికలకు సన్నద్ధం కావాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నవంబర్ 30 వరకు శ్రేణులు ప్రజా క్షేత్రంలో ఉండాలని, సీఎం కేసీఆర్ సారథ్యంలోని చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ తిరుగుతూ వివరించాలని సూచించారు. నిర్మల్లో బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయం దక్కడం ఖాయమన్నారు. అలాగే ప్రతిపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.