మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు చేపడుతున్న ‘నీలి విప్లవం’ సత్ఫలితాలనిస్తున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 284 జలవన రుల్లో 1.38 కోట్ల పిల్లలను విడుదల చేయగా, ప్రస్తుతం జాలర్లు వేట సాగిస్తున్నారు. ఒక్కొక్కటీ రెండు నుంచి మూడు కిలోల దాకా పెరుగగా,5 వేల నుంచి 6 వేల టన్నుల దిగుబడి వచ్చే అవకాశమున్నది. ఈ లెక్కన ఒక్కో కుటుంబానికి రూ. 30 వేల నుంచి రూ. 50 వేల దాకా ఆదాయం సమకూరనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా చేపల పెంపకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా భారీ ప్రాజెక్టులతో పాటు మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు, చెరువులు, కుం టల్లో పెద్ద ఎత్తున చేప పిల్లలను విడుదల చేస్తున్నది. ఆసిఫాబాద్ జిల్లాలోని 284 జలవనరుల్లో కోటీ 38 లక్షల చేప పిల్లలను విడుదల చేసింది. ప్రస్తుతం ఆయా చోట్ల చేపల వేట సాగుతుండగా, ఒక్కొక్కటీ రెండు నుంచి మూడు కిలోల వరకు బరువు తూ గుతున్నాయి. రకాన్ని బట్టి కిలోకు రూ. 100 నుంచి రూ. 120 వరకు విక్రయిస్తున్నారు.
రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకు..
జిల్లాలోని 15 మండలాల్లో 30 మత్స్యకార సొసైటీలు ఉండ గా, వీటిలో 1900 మంది సభ్యులు ఉన్నారు. 500 లైసెన్స్ కలిగిన ఇతర సభ్యులు ఉన్నారు. జిల్లాలో మొత్తం 2400 మంది మత్స్యకారులు ఉన్నారు. ప్రస్తుతం ప్రతి రోజూ చేపల వేట కొనసాగిస్తున్నారు. సుమారు 5 వేల నుంచి 6 వేల టన్ను ల వరకు దిగుబడి వస్తున్నదని అధికారులు భావిస్తున్నారు. చి న్న చెరువుల్లో వేసిన చేపల ద్వారా ఆయా ప్రాంతాల్లోని మత్స్యకార సొసైటీల్లోని సభ్యులకు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు ఆదాయం రానుండగా, రిజర్వాయర్లలో వేసిన చేపల ద్వారా వాటి పరిధిలోని సంఘాల సభ్యులకు ఒక్కొ క్కరికీ రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు ఆదాయం సమకూరనున్నది. గతంలో కంటే చేపల సైజుకూడా ఈ ఏడాది పెద్దగా వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.