మంచిర్యాల, జనవరి 25( నమస్తే తెలంగాణ) : మొదటి, రెండు విడుతలో కరోనా కరాళ నృత్యం చేసింది. బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించాల్సి వచ్చింది. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తదోనన్న భయాందోళ నల మధ్య గడపాల్సి వచ్చింది. గతేడాది ఏప్రిల్లో ప్రభుత్వ దవాఖానాల్లోనే కాదు.. ప్రైవేట్ దవాఖానాల్లోనూ బెడ్స్ దొరకడం కష్టమైంది. ప్రముఖ ప్రైవేట్ దవాఖానాల్లో లక్షలు ఖర్చుచేసి చికిత్స పొందిన వారు ఎందరో ఉన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో చేరిన ప్రతి నలుగురిలో ముగ్గురు వెంటిలేటర్ లేక ఆక్సిజన్తోనే చికిత్స పొందాల్సిన పరిస్థితి. డబ్బుల్లేక ఆస్తులమ్ముకొని వైద్యం చేయించుకున్నా ప్రాణాలు దక్కని వాళ్లెందరో.. అలాగే ప్రాణాలు దక్కించుకున్నా అప్పుల పాలైన వారూ ఉన్నారు. ఇక రెండో వేవ్లో మరణాలు కూడా ఎక్కువనే సంభవించాయి. ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు మృత్యువాత పడిన సందర్భాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు నిత్యం భయంభయంగా గడిపారు.
ప్రభావం చూపని మూడో దశ..
కరోనా వైరస్ మూడో దశ(ఒమిక్రాన్)లో అంతగా ప్రభావం చూపడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ప్రభుత్వం తీసుకుం టున్న చర్యలేనని వైద్యాధికారులు చెబుతున్నారు. గతేడాది బెడ్స్ దొరకని పరిస్థితి ఉండగా, ప్రస్తుతం ఇంట్లోనే అత్యధిక మంది హోం ఐసొలేషన్ కిట్లతోనే కోలుకుంటున్నారు. వైరస్ సోకిన కొందరు ఓపీకి వచ్చి పరీక్షలు చేయించుకుని మందులు తీసుకుని ఇంటికి వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం 48 మంది మాత్రమే ప్రభుత్వ దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారు. వీరికి ఆక్సిజన్, వెంటి లేటర్లతో పని లేకుండా మామూలు చికిత్సనే అందిస్తున్నామని ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు.
సత్ఫలితాలిస్తున్న జ్వర సర్వే..
కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలే కారణమని ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. మూడో దశ విజృంభిస్తున్న తీరు చూస్తే ఇప్పటికే దవాఖానాలు కిట కిటలా డా ల్సింది. ప్రస్తుతం సర్కారు ముందస్తు చర్యలతో కరోనా నియం త్రణలోకి వచ్చిందని పలువురు పేర్కొంటున్నారు. వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయడంతో నిరోధక శక్తి పెరిగింది. కరోనా వచ్చిన ప్రభావం అంతగా కనిపించడంలేదు. మరోవైపు సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని జ్వర సర్వే నిర్వహిస్తున్నది. దవాఖా నలకు వెళ్లి పరీక్షలు చేయించుకోలేని వారికి ఇంటింటికీ వెళ్లి టెస్టులు చేస్తున్నది. పాజిటివ్ లక్షణాలు ఉంటే మెడిసిన్ అందిస్తున్నది. నెగెటివ్ ఉన్నవారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తున్నది. ము ఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో మాస్కు ధరించేలా, శానిటైజేషన్ చేసు కునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నది. భౌతిక దూరం పాటిం చేలా చర్యలు తీసుకుంటున్నది. ఒమిక్రాన్ వచ్చినప్పుడు ఆందోళన వద్ద ని, అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని పేర్కొంటున్నది.
వ్యాక్సినేషన్తో తగ్గుముఖం
కొవిడ్, ఒమిక్రాన్ రెండూ ఒకటే.. ఇవి వచ్చిన వారిలో జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, జ్వర లక్షణాలు ఉంటాయి. వ్యాక్సినేషన్ పూర్తవడంతో కొవిడ్ ప్రభావం అంతగా కన్పించడంలేదు. లక్షణా లు ఉన్నా ప్రభుత్వం నిర్దేశించిన మందులు వేసుకోవడం వల్ల తగ్గి పోతున్నది. చిన్న పిల్లలో కరోనా ప్రభావం అంతగా కన్పించడం లేదు. ప్రైవేటుకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన పనిలేదు. సర్కారు దవాఖానల్లో మెరుగైన సేవలందుతున్నాయి. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలి.