మంచిర్యాల, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పలు చోట్ల ధాన్యం కొనుగోళ్లు మొదలుకాలేదు. రైతులు వడ్లను కల్లాలకు తెచ్చి 20 రోజులు అవుతున్నా కొనుగోళ్లు జరగడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వడ్లను ప్రైవేటు దళారులకు విక్రయిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 508 ధాన్యం కొనుగోలు సెంటర్లకు 215 సెంటర్లలోనే ఇప్పుడు ధాన్యం కొంటున్నారు. మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో తప్ప ఆసిఫాబాద్, ఆదిలాబాద్లో ఇంకా కేంద్రాలు తెరచుకోలేదు. ఆసిఫాబాద్ జిల్లాలో 35 సెంటర్లకు 15 సెంటర్లను అధికారులు స్టార్ట్ చేశారు. కానీ.. ఇప్పటి వరకు ధాన్యం కొనలేదు. మంచిర్యాల జిల్లాలో 262 సెంటర్లకు 92 కేంద్రాల్లో ధాన్యం కొంటున్నారు. నిర్మల్ జిల్లాలో 208 సెంటర్లకు కడెం, ఖానాపూర్, ముథోల్ ప్రాంతాల్లో 125 సెంటర్లు తెరిచారు. కానీ.. వడ్లు మాత్రం 25 సెంటర్లకే పరిమితమైనట్లు తెలిసింది. ఆదిలాబాద్ జిల్లాలో మూడు సెంటర్లు ఇంకా మొదలు కాలేదు. సాధారణంగా మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోతలు కొంచెం ఆలస్యం అవుతాయి. దీంతో ధాన్యం వచ్చాకే సెంటర్లు తెరుస్తామని అధికారులు చెప్తున్నారు. ఇక్కడే అసలు సమస్య వస్తున్నది. రైతులు ధాన్యం తెచ్చి కేంద్రాల దగ్గర పోశాకే అధికారులు కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తుండడంతో ఆలస్యం అవుతున్నది. మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో కొన్ని సెంటర్లలో ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. కాగా.. మంచిర్యాల జిల్లాలో గతంతో పోలిస్తే ఈ సారి కొన్ని సెంటర్లను తీసివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో సెంటర్ ఉన్న దగ్గర వడ్లు పోసుకుని కొనేవారి కోసం ఎదురు చూస్తున్నారు. కాగా.. చాలా కేంద్రాలకు గన్నీ సంచులు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నాయి.
మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని బూర్గుపల్లి కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు చేయక చాలా మంది రైతులు ప్రైవేటు దళారులకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. ఈ విషయంలో ‘నమస్తే తెలంగాణ’లో ఇటీవ ల కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. ఇ ప్పటికీ ఈ కేంద్రంలో 300 క్వింటాళ్ల వరకు వడ్లు వచ్చి ఉన్నాయ్. కానీ.. కొనుగోలు మా త్రం చేయడం లేదు. నిర్వాహకులకు అడిగితే రేపు కొంటాం, మాపు కొంటాం అంటూ 15 రోజులుగా దాటవేసుకుంటూ వచ్చారు. చివరకు బుధవారం కొనుగోలు కేంద్రానికి వచ్చిన అధికారులు ధాన్యం నేలపై ఆరబోశారని, వా టిలో తాలు ఎక్కువ ఉందని, అందుకే తూ ర్పార పట్టాక కొంటామని చెప్పి వెళ్లిపోయిన ట్లు రైతులు చెప్తున్నారు. ఈ విషయం గడిచిన 15 రోజులుగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబితే అయిపోయేదని వాపోతున్నారు. ఇప్పటికే మాయిశ్చర్ 16 నుంచి 17 వస్తుంద ని ఇప్పుడొచ్చి తూర్పార పట్టమంటే ఎక్కడికి పోవాలంటూ బాధపడుతున్నారు. గడిచిన ప దిహేను రోజులుగా కొనేవాళ్లు లేక ఇప్పటికే చా లా మంది రైతులు క్వింటాలుకు రూ.1800 నుంచి రూ.2వేల చొప్పున నష్టానికి అమ్ముకున్నారని చెప్తున్నారు. పోయిన సారి ధాన్యం వ చ్చిన రెండు, మూడు రోజులకే కొన్నారని, ఇ ప్పుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని చెప్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా ఇలా నేలపైనే ధాన్యం పోసి విక్రయిస్తున్నామ ని, ఈ సారి అలా కుదరని అధికారులు అంటున్నారు. తమ బాధలు ఎవ్వరికీ చెప్పుకోవాలో అర్థం కావడం లేదంటున్నారు. పైగా పేపర్లో న్యూస్ వచ్చినందుకు వాయిస్ ఇచ్చిన రైతు వడ్లు కొనమంటూ సెంటర్ నిర్వాహకులు చెప్తున్నట్లు తెలిసింది. మరి ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని ఇక్కడ సమస్యను పరిష్కరించాలని రైతులు వేడుకుంటున్నారు.
గర్నమెంట్ ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తున్నది. తేమ శాతం పేరిట మేము రోడ్లపైనే వడ్లు ఎండపోయాల్సి వస్తున్నది. మరోవైపు అకాల వర్షాలు వస్తుండడంతో ఉన్న ధాన్యం తడిస్తే మొత్తానికే నష్టపోవాల్సి వస్తున్నదని ప్రైవేటు వ్యక్తులకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నాం. ఇక్కడ అధికారులు, నాయకులు ఎవరు పట్టించుకోవడం లేదు. నాకు తెలిసిన రైతులు ఇద్దరు ముగ్గురు ఈ మధ్యే అమ్ముకున్నారు. నేను కూడా బయటే అమ్ముకుందాం అనుకుంటున్నా. తేమ శాతం 30 ఉన్నా కూడా ప్రైవేట్ వాళ్లు తీసుకెళ్లిపోతున్నరు. కిర్గల్(కే)లో ధాన్యం కొనుగోలు సెంటర్ ఉన్నప్పటికీ కొనుగోళ్లు మొదలుకాలేదు. సెంటర్కు ఈ రోజే గన్నీ బ్యాగ్లు వచ్చాయి. సాయంత్రం నుంచి కొనుగోళ్లు మొదలుపెడతామని చెప్తున్నరు. మరి రేపటిలోపైనా కొనుగోళ్లు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. – పాణ్యం కోటేశ్వర్రావు, బాసర.
మంచిర్యాల జిల్లా భీమారం మండలం ధర్మారం మాది. పోయిన సారి పక్కనున్న రెడ్డిపల్లికి, మా ఊరికి కలిసి ధర్మారంలో ధాన్యం కొనుగోలు చేశారు. ఈ సారి కూడా కొంటరని పోయినేడు ధాన్యం అమ్మిన కేంద్రం దగ్గరకు తెచ్చి వడ్లు పోసుకున్నాం. నలుగురైదుగురు రైతులు వడ్లు తెచ్చి పోసి 18 రోజులు అవుతుంది. నా ఒక్కవినే 300 క్వింటాళ్లు ఆరబోసుకున్నా. తీరా మా దగ్గర సెంటర్ లేదని చెప్తున్నారు. దాదాపు 20 లారీల నుంచి 30 లారీల ధాన్యం ఈ సెంటర్ నుంచి వస్తది. అందుకే మా ఊరిలో సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. దూరం పోయి అమ్ముకునే పరిస్థితి లేదు. అధికారులు పోయినేడు ఉన్న సెంటర్ను తిరిగి ప్రారంభిస్తే బాగుంటది.