తాంసి: గ్రామాల్లో వందశాతం కొవిడ్ వ్యాక్సిన్ వేయించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకునేలా వారిని ప్రోత్సహించాలని సూచించారు. వ్యాక్సినేషన్ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడం అభినందనీయమని పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు రెండవడోస్ ఎప్పుడు తీసుకోవాలో ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఏవైనా సలహాలు, సూచనలు అవసరమైతే ఫోన్ చేసేందుకు హెల్ప్ డెస్క్కు, లేదా టోల్ ఫ్రీ నంబర్ను పంచాయతీ కార్యాలయంలో అందబాటులో ఉంచాలన్నారు.
వ్యాక్సిన్ తీసుకున్నవారు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటి, ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. అనంతరం అంగన్వాడీ సెంటర్లో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కిషన్, డీఎంఅండ్హెచ్వో డాక్టర్ నరేందర్రాథోడ్, జిల్లా పౌరసరఫరాల అధికారి సుదర్శన్, అడిషనల్ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ సాధన, ఎంపీడీవో రవీందర్, ఏపీఎం రవీందర్, సర్పంచ్ సంజీవ్రెడ్డి, ఎంపీటీసీ రేఖ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.