కాంగ్రెస్ సర్కారు ప్రారంభించిన మహాలక్ష్మి పథకంతో తాము ఉపాధి కోల్పోతున్నామని, వెంటనే ఈ పథకాన్ని నిలిపివేయాలని కోరుతూ గురువారం ఆటో యూనియన్ల నాయకులు, యజమానులు, డ్రైవర్లు నిరసన చేపట్టారు. నిర్మల్లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఆటోలను నిలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్(జీ), లక్ష్మణచాంద, భైంసా మండల కేంద్రాల్లో రాస్తారోకో చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని పోలీస్ స్టేషన్లో వినతి పత్రం అందజేశారు. తమ ఉపాధిపై దెబ్బ కొట్టేలా తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, లేదంటే తమకు ఉపాధి కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.
-నిర్మల్ అర్బన్/ నర్సాపూర్ జీ / లక్ష్మణచాంద/ బైంసా/ ఇచ్చోడ/ డిసెంబర్ 14