నార్నూర్, మే 17 : రైతులు ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలని హర్టికల్చర్ డీజీఎం రాంమోహన్ సూచించారు. మండలంలోని తాడిహత్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం రైతులకు ఆయిల్పామ్ సాగుపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్పామ్ సాగుతో కలిగే ప్రయోజనాలు వివరించారు. కార్యక్రమంలో ఏడీఏ గణేశ్, ఏవో రమేశ్, ప్రవీణ్యాదవ్, సాయికిరణ్, ఉపసర్పంచ్ ఫడ్ విష్ణు, తదితరులు పాల్గొన్నారు.