మంచిర్యాల అర్బన్/ఆసిఫాబాద్ టౌన్, జూన్ 21 : యోగాతో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఆదివారం రామగుండం కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో యో గా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీపీ అంబర్కిశోర్ ఝా ధ్యానం చేశారు. ఇక మంచిర్యాల కలెక్టరేట్లో యోగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల పురపాలక మేయర్ ధరణి మధుకర్, డిప్యూ టీ మేయర్ సల్ల రమ్య, ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.ప్రసాద్, ఆయూష్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా.పద్మజ, డీపీవో ప్రశాంతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా సమన్వయకర్త సురేఖ ప్రేమ్ సాగర్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
జిల్లా మాస్ మీడియా అధికారి బుక వెంకటేశ్వర్, ఆసిఫాబాద్ జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, అంగన్ వాడీ సిబ్బంది, వెలుగు ఆరోగ్య కార్యకర్తలు, యోగా కోఆర్డినేటర్లు, ఆయూష్ ఆరోగ్య మందిరాల వైద్యాధికారులు పాల్గొన్నారు. ఇక ఆసిఫాబాద్లోని కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ హరిత ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. జిల్లా అధికారులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు యోగా సాధకులతో కలిసి యోగాసనాలు వేశారు. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడమే దేశానికి మనం చేసే అతిపెద్ద సేవ అ ని పునరుద్ఘాటించారు. ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకాశ్, వైస్ చైర్మన్ ఎండి హైమద్, యోగా ఆచార్యులు అశో క్ ఆచార్య, కళాశాల ప్రిన్సిపాల్, అధికారులు, యోగా సాధకులు పాల్గొన్నారు.