మంత్రికి ఆహ్వాన పత్రిక అందజేత
దిలావర్పూర్, ఏప్రిల్ 24 : నిర్మల్ జిల్లాలోనే అత్యంత ప్రాచీనమైన మండలంలోని కాల్వ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు రావాలని ఆలయ చైర్మన్, దేవాదాయశాఖ అధికారులు కోరారు. ఈమేరకు సోమవారం ఆహ్వాన పత్రిక, గోడప్రతులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సమక్షంలో విడుదల చేశారు. మే 4 నుంచి ప్రారంభం కానున్న నృసింహుని బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని మంత్రి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..
తీవ్రమైన ఎండల నేపధ్యంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. తాగునీటి సమస్యలేకుం డా చర్యలు తీసుకోవాలని కోరారు. కల్యాణం రోజు భక్తులు జిల్లా నలుమూలల నుంచి భక్తులు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చే యాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆల య చైర్మన్ చిన్నయ్య, దేవాదాయ శాఖ డివిజనల్ ఇన్స్పెక్టర్ రవికిషన్గౌడ్, బన్సపల్లి సహకార సం ఘం చైర్మన్ పీవీ రమణారెడ్డి, బీఆర్ఎస్ మండల నాయకులు పాల్దే అనిల్, ఆడెపు శ్రీనివాస్, పూ జారం మహేశ్, ఒడ్నం కృష్ణ, ఆలయ ధర్మకర్తలు కిషన్, ఆలయ పండితులు రాము, శ్రీనివాస్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.