భైంసాలోని గాంధీ గంజ్ ముందు, గుజిరి గల్లిలో జొన్న రొట్టెలను అప్పటికప్పుడు తయారు చేసి వేడి వేడిగా అందిస్తున్నారు. అంతే కాకుండా ఉదయం పూట మొలకెత్తిన విత్తనాలు సైతం అమ్ముతున్నారు. జొన్న రొట్టెలు ఒకటి రూ. 15 అంతేకాకుండా ఉడక బెట్టిన కోడి గుడ్డు రూ. 10, మొలకెత్తిన విత్తనాలు రూ. 20 లకు 50 గ్రాముల చొప్పున విక్రయస్తున్నారు. అంతే కాకుండా రాగిజవా సైతం తాగుతున్నారు. పోషకాలు, పీచు పదార్థాలు అధికంగా ఉండడంతో జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు ఉపక్రమి స్తున్నది. ఎముకలు ధృఢత్వానికి దోహదం చేస్తుంది. అధిక రక్తపోటు, ఒత్తిడి, శరీరంలో ఉన్న వేడిని తగ్గించి చల్లదనాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతు న్నారు. చిరుధాన్యాలతో పాటు టిఫిన్లు అందు బాటులో ఉంటున్నాయి.
మారుతున్న జీవనశైలితో పాటు కరోనా మహమ్మారి నేర్పిన గుణపాఠంతో సంప్రదాయ వంటలు, ఆహార పదార్థాల వైపు ప్రజలు మల్లు తున్నారు. ప్రతి రోజూ ఒక పూట జొన్నరొట్టె తినేలా చూసుకుంటున్నారు. ప్రొటీన్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండడంతో శరీరానికి కావాల్సిన శక్తిని అందించేందుకు జొన్నరొట్టెలు ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఆకుకూరలు, కూరగాయలు ఒక పూట తినేలా ప్లాన్ చేసు కుంటున్నారు. రోడ్లపై దొరికే ఫాస్ట్పుడ్, హోటల్స్ ఇతర పదార్థాలు తినకుండా ఇంట్లోనే తయారు చేసే ఆహారాన్ని తీసుకునేందుకు ఇష్టపడు తున్నారు. మాంసం, ఇతర ఆయిల్తో తయారు చేసే వంటకం కంటే కూరగాయాల భోజనం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పూర్వకాలంలో ఇంట్లో ఉన్న దినుసులతోనే ఆహారం తయారు చేసుకొని తినేవారు. రాను రాను హోటళ్లు, రెస్టారెంట్ల ప్రబల్యం పెరగడం, ప్రజలు పనుల్లో బిజీ బిజీ మారడంతో ఎప్పుడు ఎక్కడ ఆకలి అనిపించినా నోటికి రుచిగా ఉండే ఏదో ఒక ఆహారాన్ని తినడం అలవాటైంది. దీంతో వివిధ రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మళ్లీ పాద పద్ధతులను పాటిస్తున్నారు. దీంతో రాగి జావ, జొన్న రొట్టె వంటి ఆహారాన్ని తీసుకుంటున్నారు.
ప్రతి రోజూ మా ఇంట్లో రొట్టెలను తయారు చేసుకొని ఆకు కూరలతో కలిసి ఒక పూట తింటాం. ఆరోగ్యానికి జొన్నరొట్టెలు, రాగిజావ చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం దొరకుతున్న రసాయనాలతో పండించిన కూరగాయలు తినాంటే భయపడాల్సి వస్తున్నది. సంప్రదాయంగా దొరుకుతున్న వాటితో వంటలు చేసుకొని తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
– సురేశ్, ల్యాబ్ టెక్నీషియన్
భైంసా పట్టణంలో జొన్న రొట్టెలు ఎక్కువగా తింటు న్నారు. చాలా మంది జొన్నరొట్టెలు తినేందుకు దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. ఒక రొట్టె రూ. 10 నుంచి 15 వరకు అమ్ముతున్నారు. అంతేకాకుండా జొన్నరొట్టెలతో పాటు కర్రీలను సైతం విక్రయిస్తున్నారు. జొన్న రొట్టెలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రజలు పెద్ద సంఖ్యలో ఇష్టపడుతున్నారు.
– హరీశ్