తుంగతుర్తి, అక్టోబర్ 4 : కాంగ్రెస్, బీజేపీ మాయ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో వెంపటి రోడ్డులో రూ.కోటి 10 లక్షలతో నిర్మించిన నూతన క్యాంప్ కార్యాలయం, వసతి గృహాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఒక లక్షా 20 వేల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్, 13 వేల మందికి కల్యాణలక్ష్మి, 50 వేల మందికి ఆసరా పింఛన్లు, దళిత బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, రుణమాఫీ వంటి పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.
నియోజకవర్గంలో తలపెట్టిన ఆశీర్వాద సభ, అభివృద్ధి సభలు అనుకున్న దానికంటే రెట్టి ంపు దశలో ప్రజలంతా ఆశీర్వదించినట్లు తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తుంగతుర్తి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురడం ఖాయమన్నారు. నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పలువురు నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు.
శాలిగౌరారం : మండలంలోని మాదారం కలాన్ గ్రామం నుంచి ఇటుకులపహాడ్ గ్రామం వరకు 3.6 కిలోమీటర్ల దూరంతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి సీఆర్ఆర్ గ్రాంట్ నుంచి మంజూరైన రూ.3.50 కోట్లతో రోడ్డు నిర్మాణానికిశిలాఫలకాన్ని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించి అన్ని వర్గాల ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు. అంతర్గతంగా ఉన్న రహదారులను సీసీ రోడ్లు, బీటీ రోడ్లుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. పట్టణాలకు ధీటుగా గ్రామాలను అభివృద్ధ్ది చేసేందుకు ఒక లక్ష్యంతో పని చేస్తున్నారని అన్నారు.
కార్యక్రమంలో ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎంపీపీ గంట లక్ష్మమ్మ, జడ్పీటీసీ ఎర్ర రణీలాయాదగిరి, వైస్ ఎంపీపీ కందుల అనిత, సర్పంచ్ జెర్రిపోతుల మంజులాచంద్రమౌళిగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ తాళ్లూరి మురళి, మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి తేజస్వి, తాసీల్దార్ పాల్సింగ్, ఎంపీడీఓ లక్ష్మయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయితగోని వెంకన్నగౌడ్, ప్రధాన కార్యదర్శి చాడ హతీశ్రెడ్డి, గుండా శ్రీనివాస్, కట్టా వెంకట్రెడ్డి, మామిడి సర్వయ్య, గుజిలాల్ శేఖర్బాబు, చివుట సైదులు, అక్కెనపెల్లి శ్రీరాములు, సుల్తాన్ ఎల్లయ్య, బీనబోయిన లక్ష్మయ్య, మామిడి రమేశ్, చింతల శంకర్, వెంకటపతి పాల్గొన్నారు.