నిర్మల్ అర్బన్ : నిర్మల్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ పట్టణ వాసులకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ వాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.నిర్మల్ పట్టణంలో ఇంటింటా చెత్త సేకరిస్తూ బాధ్యతగా విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య సిబ్బంది దేవి అడెల్ల, తెడ్డు లక్ష్మి, నిగులపు రాజేశ్వర్, చాకలి సతీశ్ను సన్మానించి ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు చేస్తున్న సేవలను కొనియాడారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే పారిశుధ్య కార్మికులకు సముచిత గౌరవాన్ని అందించి వేతనాలను భారీగా పెంచిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.