కుంటాల : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. బుధవారం కుంటాల మండల కేంద్రంలో ఆయన పర్యటించారు. సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తోందని పేర్కొన్నారు. కుంటాల మండలంలో కాళేశ్వరం 27 ప్యాకేజీ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటానన్నారు.
భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారుల అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గజ్జారాం, జడ్పీటీసీ గంగామణి, సొసైటీ చైర్మన్ సట్ల గజ్జారాం, సర్పంచ్ డి. సమత ,ఆత్మచైర్మన్ సవ్వి అశోక్ రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ముజిగే ప్రవీణ్, టీఆర్ఎస్ కన్వీనర్ పడకంటి దత్తు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక రైతు వేదికలో 86 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి , షాదీముబారక్ చెక్కులను అందజేశారు. కుంటాల మండలంలో రూర్బన్ పథకం ద్వారా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు.