దిలావర్పూర్ : రైతులు మార్కెట్ డిమాండ్ బట్టి పంటలను సాగు చేసి ఆర్థికంగా బలోపేతం కావాలని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవిశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన దిలావర్పూర్లో బన్సపల్లీ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతును రాజు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. రైతులు పంటలను ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.
మొదటి రకం ధాన్యానికి మద్దతుధర రూ.1960, రెండవ రకానికి రూ.1940 గా సర్కారు నిర్ణయించింని వివరించారు. రైతులు ఒకే రకమైన పంటలను సాగు చేయకుండా, వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు భూసార పరీక్షలు చేయించి , పంటల మార్పిడి పద్ధతిని అవలంభించాలని కోరారు. దిలావర్పూర్ గ్రామంలోని పోచమ్మ ఆలయం వద్ద గల కోనేరు నిర్మాణానికి రూ. 25 లక్షలు, ఎల్లమ్మ ఆలయానికి రూ.80 లక్షలు, ఏక్నాథ్ ఆలయానికి రూ. 50లక్షలు త్వరలోనే మంజూరు వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బన్సపల్లీ సహకార సంఘం చైర్మన్ పీవీ రమణారెడ్డి, స్థానిక సర్పంచ్ వీరేశ్కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్ముల దేవేందర్రెడ్డి, ఎంపీపీ బాబురావు, నిర్మల్ జిల్లా సహకార సంఘం మాజీ అధ్యక్షుడు రాంకిషన్రెడ్డి, నిర్మల్ సహకార సంఘం ఉపాధ్యక్షుడు దుప్పి. సాయన్న, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు డాక్టర్ సుభాష్రావు, జిల్లా రైతు బందు సమితి సభ్యులు ఏలాల చిన్నరెడ్డి తదితరులు పాల్గొన్నారు.