కుభీర్, ఆగస్టు 04 : యువత మాదకద్రవ్యాల బారిన పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్ఐ ఏ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలకేంద్రలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం విద్యార్థులకు గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడు అలవాట్లకు కనెక్ట్ కాకుండా చదువులపై ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు. చెడు అలవాట్ల బారిన పడితే బంగారు భవిష్యత్తు సర్వ నాశనం అయిపోతుందని సూచించారు.
మత్తు పదార్థాలు వినియోగించినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 14500 కాల్ చేసి తెలపాలని కోరారు. పోలీసులు ఎల్లప్పుడూ మీకోసం సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇలాంటి వారిపై కఠినంగా పోలీస్ శాఖ వ్యవహరించనున్నట్లు తెలిపారు. డ్రగ్స్ రైత సమాజం కోసం యువత నడుం బిగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ లక్ష్మణ్, అధ్యాపకులు విద్యార్థులు ఉన్నారు.