ముథోల్ : వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని విట్టోలి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోకుండా మద్దతు ధరకు పంటను అమ్ముకోవాలని సూచించారు.
ఏ గ్రేడు వరి ధాన్యానికి రూ. 1960, బీ గ్రేడు వరి ధాన్యానికి రూ. 1940 లు చెల్లిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీవో శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అప్రోజ్ ఖాన్, సర్పంచ్లు రాంరెడ్డి, సత్య గౌడ్, నాయకులు రవీందర్ రెడ్డితో పాటు రైతులు ఉన్నారు. ముథోల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధితులకు ఎమ్మెల్యే సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు.