బోథ్, జనవరి 20 : పోలీసులు ప్రజలతో స్నేహ పూర్వకంగా మెలగాలని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి సూచించారు. బోథ్ పోలీస్ స్టేషన్ను గురువారం సందర్శించారు. పోలీసు స్టేషన్ ఆవరణలో ఉన్న చిల్డ్రన్స్ పార్కును సందర్శించారు. పోలీసు సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వస్తారని, వారి ఆవేదనను అర్థం చేసుకొని న్యాయం జరిగేలా చూడాలన్నారు. ప్రజలతో సత్సంబంధాలు ఏర్పర్చుకొని శాంతి భద్రతల పరిరక్షణకు సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో మూఢ నమ్మకాలు, చెడు వ్యసనాలు దూరం చేయడానికి కృషి చేయాలన్నారు. కరోనా తీవ్రత పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉంటూ అందరూ మాస్కులు ధరించేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, బోథ్ ఎస్ఐలు దివ్యభారతి, అజయ్కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలతో మమేకం కావాలి
బజార్హత్నూర్, జనవరి 20 :త శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజలతో మమేకమై సేవలందించాలని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి సూచించారు. బజార్హత్నూర్ పోలీస్స్టేషన్ను ఆయన సందర్శించారు. స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించారు. మండలంలోని క్రైం వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం స్టేషన్లోని లాకప్రూం, రిసెప్షన్సెంటర్, రైటర్ గదులను పరిశీలించి తగు సూచనలు చేశారు. గ్రామంలో సీసీకెమెరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం దగ్గరగా ఉండడంతో ఎల్లవేళలా నిఘానేత్రం పనితీరును పటిష్టంగా ఉంచాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మట్కా ఎక్కువగా సాగుతుందని, ప్రజలు దాని మోజులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. రోజురోజుకూ పెరుగుతున్న కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్టేషన్ పరిధిలోని పరిసరాలను పరిశీలించారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, బోథ్ ఎస్ఐ దివ్యభారతి, స్టేషన్ సిబ్బంది ఉన్నారు.