నిర్మల్ చైన్గేట్, ఫిబ్రవరి 8 : చలన చిత్రాల నిర్మాణానికి నిర్మల్ అనువైన ప్రాంతమని ప్రముఖ సీనియర్ నటి ఆమని, యువ నటి కోమలి అన్నారు. ‘ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు’ సినిమా షూటింగ్ పూర్తైన నేపథ్యంలో మంగళవారం రాత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ.. నిర్మల్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు రమేశ్రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో జిల్లాకు చెందిన కళాకారులకు అవకాశం కల్పించారు. రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు నిర్మించేందుకు చర్యలు చేపడుతామని డైరెక్టర్ లక్ష్మణ్ అన్నారు. అనంతరం సినిమా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వేణుగోపాలకృష్ణ, హీరోలు ఇంద్ర సాయిరాం, ఇమ్రాన్, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.