నిర్మల్ టౌన్, నవంబర్ 9: కేంద్రానికి వరిసెగ తగిలేలా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఈ నెల 12న రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వ హిస్తామని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంలోని వ్యవసాయ కార్యాలయంలో ఆత్మ కొత్త పాలకవర్గ చైర్మన్ గంగారెడ్డి, 39 మంది సభ్యుల ప్రమాణస్వీకారోత్సవానికి మంగళవారం హాజరయ్యారు. రాష్ట్రం లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త చేపడుతున్న 24 గంటల కరంట్, ప్రాజెక్ట్లు, మిషన్ కాకతీయ చెరువుల ద్వారా వరి పెద్ద ఎత్తున పండిందని, బీజేపీ నాయకులు జీర్ణించుకోలేక ధాన్యం కొనుగోలుపై కొర్రీలు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీ నాయకులు రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రిపైనే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ము ఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా బీజేపీ నేతలు బండి సంజయ్, అరవింద్, కిషన్రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి కొనబోమని చెబుతున్న కేంద్రంపై తేల్చుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయడం హేయమన్నారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు వ్యవసాయ శాఖ అ ధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ మా ట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమ మే ప్రధాన లక్ష్యంగా అనేక పథకాలు అమలు చే స్తున్నదని గుర్తు చేశారు.
నిర్మల్ ఆత్మ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం వ్యవసాయ శాఖ కార్యాలయంలో నిర్వహించారు. అధ్యక్షుడిగా కనకాపురం గంగారెడ్డి తో పాటు మొత్తం 39 మంది డైరెక్టర్లతో వ్యవసాయ శాఖ అధికారులు, మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీ కారోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో గంగారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రఘనందన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ వెంకటరామిరెడ్డి, ప్రముఖ వ్యా పారవేత్త మురళీధర్రెడ్డి, ఎంపీపీలు రామేశ్వర్రె డ్డి, మహిపాల్రెడ్డి, చంద్రకళా రమేశ్. జడ్పీటీసీ జీ వన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మదా ము త్యం రెడ్డి, ఎఫ్ఏసీఎస్ మాజీ చైర్మన్ ధర్మాజీ రా జేందర్, డీసీసీబీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణ ప్రసాద్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముత్యంరెడ్డి, గోవర్ధన్రెడ్డి, మల్లేశ్, దేవేందర్రెడ్డి, మాధవరావు, రవీందర్రెడ్డి, గోవర్ధ్దన్రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్, ఏ డీఏ వినయ్బాబు, వీణ, వ్యవసాయాధికారులు వసంత్, ప్రవీణ్, నాగరాజు, స్రవంతి, వీణారెడ్డి, డీపీఆర్వో ఉమారాణి, తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ ప్రధాన దవాఖానలో రూ. 1.3 కోట్లతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంటును ఆయన ప్రారంభించారు. జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వైద్యులు సమయపాలన పాటిం చాలని సూచించారు. థర్డ్ వేవ్ పొంచి ఉన్న దృ ష్ట్యా ఈ ప్లాంట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నిర్మల్ దవాఖాన అభివృద్ధికి రూ. 48.88 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ప్రాంతీ య దవాఖాన నిర్మాణంపై చీఫ్ ఇంజినీర్తో మా ట్లాడగా రూ. 25 నుంచి రూ.30 కోట్ల వ్యయం అంచనా వేసినట్లు తెలిపారు. త్వరలో ఈ దవాఖా న నిర్మాణానికీ చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ మాట్లాడుతూ వైద్యాధికారులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యే విఠల్రెడ్డి, అదనపు కలెక్ట ర్ హేమంత్ బోర్కడే, దవాఖాన సూపరింటెండెం ట్ దేవేందర్రెడ్డి, ఎంసీహెచ్ డాక్టర్ రజని, సారంగాపూర్ జడ్పీటీసీ రాజేశ్వర్రెడ్డి, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, బాసర ఎంపీపీ సుశీలబాయి, ల యన్స్ క్లబ్ అధ్యక్షుడు గంగారెడ్డి పాల్గొన్నారు.
కౌట్లలో అభివృద్ధి పనులు ప్రారంభం..
రూ. 40వేల కోట్ల బడ్జెట్తో మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు శుద్ధ జలాన్ని అందిస్తున్నట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలంలోని కౌ ట్ల(బి)లో విద్యుత్ సబ్స్టేషన్, పల్లె ప్రకృతి వనం, వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించా రు. అనంతరం పల్లె ప్రకృతి వనంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. మంత్రి మా ట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా రైతులకు ఎంతో లబ్ధి చేకూరిందన్నారు. బీజేపీ నా యకులు కేవలం అసత్య ప్రచారానికే పరిమితమ య్యారని విమర్శించారు. అనంతరం జామ్ గ్రా మంలో కౌట్ల(బి) సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మంత్రి సోదరుడు అల్లోల మురళీధర్రెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, జిల్లా రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్ నల్లా వెంకట్రాంరెడ్డి, మార్కెట్ చైర్మన్ వంగ రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, డీసీసీబీ డైరెక్టర్ ఐర నారాయణరెడ్డి, ఆలూర్ సొసైటీ చైర్మన్ మాణిక్రె డ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, రైతుబంధు సమితి మండలకోఆర్డినేటర్ ఇప్ప మధూకర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మ ల్లయ్య, సర్పంచ్లు యశోద, రవీందర్రెడ్డి, విద్యుత్ యస్సీ చావన్ జవంత్రావ్, తహాసిల్దార్ సంతోష్రెడ్డి డీఈఈలు రాజేశ్వర్రావు, మధూసుదన్, ఎంపీడీవో సరోజ, ఏవో రాజశేఖర్రెడ్డి, ఏఈ శ్రీనివాస్వాస్, ఏపీవో లక్ష్మారెడ్డి, నాయకులు రాంకిషన్రెడ్డి, రాజ్మహ్మద్, శ్రీనివాస్రెడ్డి, దేవిశంకర్, ముంద్రం దినేశ్, బాశెట్టి ప్రవీణ్, దండుసాయికృష్ణ, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.