నిర్మల్ టౌన్ : వాల్మీకి జీవితం ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహార్షి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేశారు.. రామాయణ కావ్యాన్ని రాసిన గొప్ప మహార్షి వాల్మీకి అని పేర్కొన్నారు.
వాల్మీకి వల్లే రామాయణ చరిత్ర వెలుగులోకి వచ్చిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రాంబాబు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, బీసీ సంక్షేమశాఖ సహాయ అధికారి సృజయ్కుమార్, టీఎన్జీవో అధ్యక్షుడు ప్రభాకర్, కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.