పెంబి: నిర్మల్ జిల్లా పెంబి మండలంలో అటవీశాఖ అధికారులు అడ్డుకోవడంతో పలు గిరిజన గ్రామాలలో ఐటీడీఏ ద్యారా నిర్మిస్తున్న ఇండ్లు అర్దాంతరంగా నిలిచిపోయాయి. ఐటీడీఏ ద్వారా మండలంలోని జంగంగూడ గ్రామపంచాయతీ పరిధిలోని కొలంగూడ గ్రామంలో 8 ఇండ్లు, తాటిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని కొలంగూడలో 10 ఇండ్లు, పుల్గంపాండ్రిలో 6 ఇండ్లు దయ్యాలమద్ధి గ్రామంలో 9 ఇండ్లు మంజూరయ్యాయి. ఒక్కొక్క ఇల్లుకు రూ. 2.5 లక్షలు మంజూరయ్యాయి.
జంగన్గూడా గ్రామపంచాయతీ పరిధిలోని కొలంగూడలో 8 ఇండ్లకు పిల్లర్లు వేశారు. అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో పిల్లర్ల దశలోనే ఇండ్లు నిలిచిపోయాయి. మిగతా గ్రామాలలో భూమిపూజా చేసి ఆపేశారు. ఇండ్ల నిర్మాణ పనులను మధ్యంతరంగా నిలిపివేయాడంతో లబ్ధిదారులు ఆవేదన చెండుతున్నారు. అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు స్పందించి ఇండ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.