భైంసా: మహాత్మాగాంధీ బాపూజీ గ్రామ స్వరాజ్యం కోసం కన్న కలలను రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిజం చేస్తుందని ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. శనివారం బాపూజీ జయంతి సందర్భంగా పట్టణంలోని గాంధీ గంజ్ ముందు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీజీ మార్గాన్ని అనుసరించడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
గ్రామ స్వరాజ్య ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పారిశుధ్యం, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ పి. కృష్ణ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఫారుఖ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆసిఫ్, మురళి గౌడ్, ప్రసంజిత్ ఆగ్రే, తోట రాము, రమేశ్ మాశెట్టి వార్, తదితరులు ఉన్నారు. పట్టణంలోని తహసీల్ కార్యాలయంలో, తదితర కార్యాలయాల్లో గాంధీ, లాల్బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తాసీల్దార్ విశ్వంబర్, గిర్దావార్ ప్రవీణ్ కుమార్, ఎంసీ గజ్జర్ సింగ్, వీఆర్వోలు, బీజేపీ కార్యాలయంలో పడకంటి రమాదేవి, తదితరులు ఉన్నారు.