పెంబి : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. బుధవారం మండలంలోని పెంబి, మందపల్లి, ఇటిక్యాల, తాటిగూడ గ్రామాల్లో పర్యటించి అధిక వర్షాల కారణంగా ముంపునకు గురైనా పంటలను పరిశీలించారు. తహసీల్ కార్యాలయంలో 8 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతుల సంక్షేమ కోసం ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. అధిక వర్షాల కారణంగా నష్టపోయినా పంటల గురించి అసెంబ్లీలో చర్చించి రైతులకు నష్టపరిహారం అందించేలా కృషి చేస్తానన్నారు.
అనంతరం ఇటిక్యాల గ్రామంలో 5 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న భృహత్ పల్లె ప్రకృతి వనం నిర్మాణానికి భూమిపూజ చేశారు. అక్కడ పని చేస్తున్న ఉపాధి కూలీలతో మాట్లాడారు. ఉపాధి హామీ డబ్బుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందని కూలీలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకోచ్చారు. పని చేసినా వారంలోపు కూలీలకు డబ్బులు చెల్లించాలని, అలాగే జాబ్కార్డు లేని ప్రతి కుటుంబానికి జాబ్కార్డు ఇప్పించాలని ఏపీవోకు సూచించారు.
కల్యాణ లక్ష్మి పథకం ఆడబిడ్డలకు వరంలాంటిదన్నారు. ఆమె వెంట ఎంపీపీ భూక్యా కవిత, ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సల్లా నరేందర్ రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ భూక్యా గోవింద్, తాసీల్దార్ రాజ్మోహన్, ఏడీఏ ఆసం రవి, సర్పంచ్లు పూర్ణచందర్ గౌడ్, తానాజీ, సుదర్శన్, సుధాకర్ నాయకులు కొప్పుల ప్రదీప్, గాండ్ల శంకర్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.