భైంసా, జనవరి 6 : అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని డీఐవో శ్రీనివాస్ సూచించా రు. పట్టణంలోని వశిష్ఠ జూనియర్ కళాశాలలో వ్యాక్సినేషన్ను గురువారం తనిఖీ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15-18 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించారు. ఈయన వెంట డాక్టర్ మతీన్, ఖలీమోద్దీన్ పాల్గొన్నారు.
నిర్మల్లో..
విద్యార్థులు టీకాలు వేసుకోవాలని వశిష్ట హైస్కూల్ డైరెక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రవి ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ వెంకటేశ్వర్ రావు సూచించారు. పట్టణంలోని రవి, వశిష్ట ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు వైద్య సిబ్బంది టీకాలు వేశారు. సోన్ జడ్పీటీసీ జీవన్ రెడ్డి, రవి పాఠశాల ప్రిన్సిపాల్ రాణి, వశిష్ట పాఠశాల ప్రిన్సిపాల్ రవి కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ముథోల్లో..
ముథోల్లోని రబీంద్ర పాఠశాలలో వ్యాక్సినేషన్ డ్రైవ్ను తహసీల్దార్ శివ ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా 125 మంది విద్యార్థులకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. వ్యాక్సిన్పై యువకులు అపోహలు వీడాలన్నారు. ఎంపీడీవో సురేశ్ బాబు, డైరెక్టర్ పోతన్న యాదవ్, భీంరావు దేశాయ్, ప్రిన్సిపాల్ సాయినాథ్, కరస్పాండెంట్ రాజేందర్, ఏఎన్ ఎంలు, తదితరులు పాల్గొన్నారు.
భోసిలో..
భోసి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యా ర్థులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శివరాత్రే ఆనంద్ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించా రు. ఎంపీడీవో గోపాలకృష్ణారెడ్డి, హెచ్ఎం గంగా ధర్, పంచాయతీ కార్యదర్శి రవికుమార్, ఉపా ధ్యాయులు పాల్గొన్నారు.