బాసర : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వరిధాన్యాన్ని విక్రయించాలని ఎమ్మెల్యే విఠల్రెడ్డి సూచించారు. మండల కేంద్రం బాసరలో శనివారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని పేర్కొన్నారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుశీల బాబురావు, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్గౌడ్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, కోఆప్షన్ మెంబర్ సయ్యద్అలీ, వైస్ ఎంపీపీ నర్సింగ్రావు, సర్పంచ్ లక్ష్మణ్, దిగంబర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవేందర్, ఎంపీటీసీ విశ్వనాథ్, నాయకులు కోర్వ శ్యాం, ఫాసి, లాల్మీయా, మల్లుయాదవ్, మహేశ్, కోటరీ భూమన్న, కృష్ణ, సాయిలు, పోతన్న, శ్యామ్, పీఏసీఎస్ సిబ్బంది ఉన్నారు.