నిర్మల్ : జిల్లాలోని దిలావర్ పూర్ మండలం బన్సపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సొన్ మండలం జాఫ్రాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (పీహెచ్సీలు) మంగళవారం జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా బన్సపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రిజస్టర్ ను పరిశీలించారు.
అవసరమైన కిట్స్ అందుబాటులో ఉన్నాయా అని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సొన్ మండలం జఫ్రాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి కొవిడ్ -19 వ్యాక్సినేషన్కు సంబంధించిన ముందస్తు టీకా ( preacutionary dose) వేసే తీరును పరిశీలించారు.
అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు తప్పనిసరిగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సీజనల్ వ్యాధులు ప్రభలకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను. కలెక్టర్ వెంట ఆర్డీవో తుకారామ్, జిల్లా వైద్యాధికారి ధన్రాజ్,తహసీల్దార్ హిమబిందు, తదితరులు పాల్గొన్నారు.