నిర్మల్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కడెం ప్రాజెక్ట్ పొంగి పొర్లడంతో పలు గ్రామాలు జలమయమయ్యాయి. ఎంతో మంది నిరాశ్రులయ్యారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ పరామార్శించి సరుకులు అందజేశారు. ఎవరు అధైర్య పడొద్దు అండగా ఉంటామన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, తహసీల్దార్ గజానన్, తదితరులు పాల్గొన్నారు.