కడెం : నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని, గ్రామాల్లో అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో, కలిసి లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని లక్ష్మిపూర్, మద్దిపడగ, ధర్మాజీపేట గ్రామాల్లో సీసీ రోడ్లు పనులకు భూమి పూజ చేసి, గ్రామాల్లో ఏర్పాటు చేసిన హైమాస్ లైటింగ్ను ప్రారంభించారు.
మండలంలోని అంబారిపేట గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్తలు మహేశ్, రాకేశ్ తండ్రి గుండెపోటుతో మరణించగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించి, రూ. 5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.