దస్తురాబాద్ : నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి భరోసాగా నిలుస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని దేవునిగూడెం, పెర్కపల్లె గ్రామాల్లో పర్యటించి ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలిసి లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. దేవునిగూడెం గ్రామానికి చెందిన ఎం రాజన్నకు మంజురైన రూ 16 వేలు, పెర్కపల్లె గ్రామానికి చెందిన కలవ్వకు రూ 48 వేలు చెక్కులను ఆమె అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు.
మండలంలోని మున్యాల తండా గ్రామానికి చెందిన అజ్మీరా ఉదయ్ కిరణ్ ఖరగ్పూర్లో ఐఐటీ సీట్ సాధించగా అతడిని అభినందించి శాలువాతో సన్మానించారు. గ్రామంలో కొవిడ్ వ్యాక్సిన్ క్యాంపును పరిశీలించి, ప్రతి ఒక్కరూ టీకాలను వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సింగరి కిషన్, సర్పంచులు ముష్కే అంజన్న, దుర్గం శంకర్, సీదర్ల భూమేశ్, నాగవత్ సురేశ్ నాయక్, అప్పని ప్రభాకర్, నాయబ్ తాసీల్దార్ పద్మావతి, రైతు మండల అధ్యక్షుడు సిర్ప సంతోష్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముడికే ఐలయ్య యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి అర్గుల రాజనర్సయ్య, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రైతు బంధు అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.