భైంసా : పట్టణంలో ఓ దుండగుడి దాడిలో ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాన్ని బుధవారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన విగ్రహ ఏర్పాటు త్వరలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సంఘటన దురదృష్టకరమని అన్నారు. నిందితుడిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారని వెల్లడించారు. దాడి వెనుక ఇతర ఏమైనా కారణాలు ఉంటే పోలీసులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకునేలా పోలీసు శాఖ వారిని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ పి. కృష్ణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మురళి గౌడ్, రమేశ్ మాశెట్టి వార్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఫారుక్ హైమద్, మార్కెట్ వైస్ చైర్మన్ ఆసిఫ్, టీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి తోట రాము, అంబేద్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షుడు ప్రసంజిత్ ఆగ్రే, సూర్యనారాయణ, గిరిధర్ జంగ్మే, భీంరావు డొంగ్రే, గౌతం పింగ్లే, శంకర్ చంద్రే, వాసే, తదితరులు పాల్గొన్నారు.