నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 8 : నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్ గ్రామానికి చెందిన కడారి రాజాచారి-అమృత దంపతులకు ఒక కుమారుడు నరే శ్, ఒక కూతురు ఉంది. రాజాచారి పోలీస్ ఉద్యోగి కావడంతో బోథ్, సోన్ మండలాల్లో పనిచేశారు. ఈయన కుమారుడు నరేశ్ ఆయా ప్రాంతాల్లో ప్రా థమిక విద్యాభ్యాసం పూర్తి చేసి బెంగళూర్లో ఎం బీఏ పూర్తి చేశాడు. 2011 సంవత్సరంలో హైదరాబాద్లో స్టాటప్ కంపెనీలో ఇంజినీర్గా ఎంపికయ్యాడు. నరేశ్ ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియంలో చదివాడు. సర్కారు బడుల్లో చదివే పేద పిల్లలకు చేయూత నందించాలనే తలంపుతో 2015 లో గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. వచ్చే మూల వేతనంలో 30 శాతం జీతాన్ని సర్కారు బడులకు అందిస్తున్నాడు. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నప్పటికీ, పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే పిల్లల కష్టాలకు స్పందించి ఉదారతను చాటుతున్నాడు.
ప్రధానంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఇప్పటివరకు 54 పాఠశాలలకు స్మార్ట్ టీవీలు, 26 పాఠశాలలకు కంప్యూటర్లను తన సొంత ఖర్చులతో అందించాడు. నిర్మల్ జిల్లాలోని గోసంపల్లి, తానూరు, ఎల్వత్, గొండుగూడలలో కరోనా నేపథ్యంలో ఆన్లైన్ త రగతుల నిర్వహణకు సెల్ఫోన్ కొనుగోలు చేసుకోలేని పేద కుటుంబాలకు చెందిన పిల్లలను 60 మందిని గుర్తించి స్మార్ట్ఫోన్లను కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. తానూరు మండలం ఎ ల్వత్ ప్రాథమిక పాఠశాలకు రూ.1.20 లక్షలతో తాత్కాలిక షెడ్డు వేయించారు. యేటా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, డిక్షనరీ లు, స్కూల్ బ్యాగులు, షూ లు, కాస్మోటిక్ కిట్లు అందిస్తూ విద్యార్థులకు అభయహస్తం అందిస్తూ సర్కారు బడులను ప్రోత్సాహిస్తున్నారు. ఇప్పటివరకు రూ.10 లక్షల వరకు ఖర్చు చేశాడు.
నేను చిన్నప్పటి నుంచి సర్కారు బడిలో చదువుకున్నా. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలు పేదవారే కావడంతో వారికి చేయూతను అందించాలని నిర్ణయించుకున్నా. నా వేతనంలో 30 శాతం సర్కారు బడిలో సౌకర్యాలు, పిల్లలకు స్మార్ట్ఫోన్లు, ఏ అవసరమున్న అందించేందుకు కృషి చేస్తున్నా. ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం ప్రోత్సాహిస్తున్న నేపథ్యంలో ఆంగ్ల విద్యపై విద్యార్థులు పట్టు సాధించాలంటే సర్కారు బడుల్లో స్మార్ట్ఫోన్లు, స్మార్ట్టీవీలు తప్పనిసరి అవసరమని గుర్తించి తాను వాటికి అధిక ప్రాధాన్యతనిచ్చా.
– కడారి నరేశ్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, మంజులాపూర్