అదిలాబాద్ : రోడ్డు ప్రమాదంలో హోం గార్డు మృతి చెందాడు. ఈ విషాదరకర సంఘటన నిర్మల్ జిల్లా బాసరలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుబీర్ మండలం పార్డి (బి) గ్రామానికి చెందిన రమణ బాసర అమ్మవారి ఆలయలో హోం గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు.
కాగా,బాసర హెచ్పీ పెట్రోల్ పంపు వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రమణ బైక్ బొలేరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమణ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.