మంచిర్యాల, మే 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘సరిగ్గా ఐదు నెలల కిందట నిర్మల్కు వచ్చినప్పుడు మాయమాటలు నమ్మితే మోస పోతరు.. మోసపోతే గోసపడుతరు అని చెప్పిన.. కానీ, మీరు మరి మోసపోయిండ్రు.. మన అభ్యర్థులను కాకుండా వేరే వాళ్లను గెలిపించుకున్నారు.’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లాలోని మంచిర్యాల చౌరస్తా, భైంసాలోని యూనియాన్ బ్యాంక్ కూడలిలో బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుకు మద్దతుగా నిర్వహించిన రోడ్ షో కేటీఆర్ ప్రసంగించారు. నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో మన అభ్యర్థులు జంప్ కొట్టారు. నిర్మల్లో ఉన్న పెద్దమనిషి తొమ్మిదేండ్లు మంత్రి పదవి చేసినాయన కూడా జంప్ కొట్టిండు. కష్టంలో ఉన్నోడు నాయకుడు కానీ.. కష్టం రాగానే పారిపోయేటోడు ఏం నాయకుడు అంటూ కేటీఆర్ మండిపడ్డారు. తొమ్మిదేండ్లు అధికారంలో ఉన్నప్పుడేమో ఎంజాయ్ చేయాలే.. పార్టీ కింద పడ్డదో లేదో జంపా.. గింత ఆగమా.. అది కూడా గీ వయసులా అవసరమా.. ఇంకా గలీజు ఏందంటే అవతలోళ్లు వద్దంటే బలవంతంగా పోయిండంటూ చురకలు అంటించారు. మనకు వ్యక్తులతో అవసరం లేదని, వాళ్లను తిట్టే అవసరం లేదన్నారు.
నేను ఆ రోజే కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపెడుతంది.. నమ్మకండి.. నమ్మితే మోస పోతరని చెప్పిన.. కానీ.. మీరు వాళ్లనే నమ్మారు. ఉమ్మడి ఆదిలాబాద్లో బోథ్, ఆసిఫాబాద్ రెండు చోట్లనే గెలిచామని, నాలుగు కాంగ్రెస్, నాలుగు బీజేపీ వాళ్లు గెలిచారన్నారు. మరి గెలిచినంక ఈ ఐదున్నర నెలల్లో ఏం జరిగింది ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే.. ఇవాళ ఎట్టా ఉంది. గుండెమీద చేయేసి ఆలోచన చేయాలన్నారు. అరచేతిలో వైకుంఠం చూపెట్టిన రేవంత్రెడ్డి.. బస్సు ఫ్రీ అన్న డు.. బంగారం ఫ్రీ అన్నడు.. కల్యాణ లక్ష్మీ తులం బం గారం ఇస్తా అన్నడు.. రైతులకు నేను రూ.15 వేలు ఇస్తా అన్నడు.
కేసీఆర్ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తే.. నేను 48 గంటలు ఇస్తా అన్నడు.. బ్యాంక్కు ఉరికి పోయి రూ.2 లక్షలు తెచ్చుకోండి రుణమాఫీ అన్నడు. నేను డిసెంబర్ 9న రాగానే రుణమాఫీ అన్నడు.. మోచేతికి బెల్లం పెట్టి అవతల పడ్డడంటూ మండిపడ్డారు. తెలంగాణలో ఇప్పటి వరకు లక్షన్నర మంది పిల్లలు పెండ్లి చేసుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక.. ఈ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభు త్వం లక్షన్నర తులాల బంగారం మా ఆడబిడ్డలకు బాకీ ఉన్నడన్నారు. ఆడబిడ్డలకు రూ.2,500 అన్నడు ఇయ్యలే.. కేసీఆర్ పింఛన్ రూ.2 వేలు ఇస్తున్న డు. నేను రూ.4వేలు ఇస్తా అన్నడు ఇయ్యలే.. కేసీఆర్ ఇంట్లో ఒక్కొక్కరికే పింఛన్ ఇస్తున్నడు.. నేను ఇద్దరికి ఇస్తా అన్నడు.. ఇవన్నీ అయ్యాయా అని ప్రశ్నించాడు.
ఒకసారి ఒకరి చేతుల్లో మోసపోతే మోసం చేసినోడిది తప్పు.. కానీ.. రెండోసారి మోస పోయినమో బరాబరి మన తప్పే అయితదన్నారు. రేవంత్రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిసెంబర్ 9 రుణమాఫీ అన్నడు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అన్నడు. ఇవాళ సిగ్గు లేకుండా ఐదు గ్యారెంటీలు అమలు చేసినా అని చెప్పి బొంకుతున్నడు. పచ్చి అబద్ధం చెప్తున్నడు. రెండోసారి కూడా మోసం చేసేందుకు మళ్లీ వస్తున్నాడన్నారు. ఊసరవెళ్లి రంగులు మార్చినట్లు రేవంత్రెడ్డి తారీఖులు మారుస్తున్నాడన్నారు. రుణమాఫీ డిసెంబర్ 9కి రాదు.. పంద్రా ఆగస్టుకు చేస్తా.. నేను తప్పకుండా చేస్తా మళ్లొక్కసారి నన్ను నమ్మి గంగల మునగండి అంటున్నాడని, మరి మునుగుదామా గంగలా ఆలోచించాలన్నారు.
ఈ నిర్మల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే ఈ ఐదున్నర నెలల్లో, పోయిన పదేళ్లలో నరేంద్ర మోదీ ఏం చేశారో ఈ పదేళ్లలో ఆలోచన చేయాలన్నారు. ఆదిలాబాద్లో సీసీఐ తెరవలేదని.. అమిత్షా వచ్చి చెప్పి పోయిండు. కానీ, తెరిచిన పాపాన పోలేదన్నారు. ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్కు రైల్వేలేన్ అన్నడు. అది కూడా కాలేద న్నారు. ఒక్క పనైనా నిర్మల్లోగానీ, ముథోల్లోగానీ బీజేపీ ఎంపీ చేసిండా? అంటే ఏమీ లేదన్నారు. మరీ ఎందుకు ఓటేయాలో చెప్పాలన్నారు. నల్లధనం తెస్తా అన్నాడు.. నల్లధనం ఏదంటే తెల్లముఖం వేస్తున్నారం టున్నారు. రూ.15 లక్షలు ఇస్తా అన్నడు.. మీ అందరికీ రూ.15 లక్షలు వచ్చాయా.. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నడు.. చేసిండా.. చెప్పాలన్నాడు. మాట్లాడితే మతం.. హిందూ, ముస్లిం తప్ప మరొకటి తెలియదన్నారు. హిందూ, ముస్లిం అనాలే నాలుగు ఓట్లు దొబ్బాలే.. అవతల పడాలే.. హిందూ, ముస్లిం తప్ప ఇంకోటి ఎరకలేదు. అంతే తప్ప చేసిన పని ఒక్కటి కూడా లేదన్నారు. ఏడాదికి రెండు కోట్ల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అన్నడు మరి పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు వచ్చినయా.. రైతుల ఆదాయం డబుల్ అయ్యిందా.. బుల్లెట్ రైలు ఉరికిస్తా అన్నడు.. అయినయా చెప్పాలన్నారు.
నిర్మల్ జిల్లా కావాలే అనేది దశాబ్దాల కల అని కేటీఆర్ అన్నారు. దాన్ని నెరవేర్చిన ఘతన కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఇవాళ రేవంత్రెడ్డి పార్లమెంట్కు ఒకటే జిల్లా చేస్తా అంటున్నాడు. ఆదిలాబాద్ పార్లమెంట్లో అయితే ఆదిలాబాద్ జిల్లా ఉండాలే.. లేకపోతే నిర్మల్ ఉండాలే.. లేకపోతే కుమ్రం భీం ఆసిఫాబాద్ ఉండాలే. మరి ఆలోచించుకోండి మీరు నిర్మల్ జిల్లా ఉండాల్నా.. అంటే జనం ఉండాలంటూ సమాధానం ఇచ్చారు. దీనికి కేటీఆర్ నిర్మల్ జిల్లా ఉండాలంటే అత్రం సక్కు గెలవాలే కారు గుర్తుకు ఓటేయాలన్నారు. నిర్మల్ జిల్లా పోయినా పర్లేదు అనుకుంటే మీ ఇష్టం.
ఆత్రం సక్కు ఒక సీనియర్ ఎమ్మెల్యే.. ఆదివాసీ బిడ్డ.. గతంలో తుడుం దెబ్బ ఉద్యమాల్లో పని చేసిన బిడ్డ.. ఆనాడు సామాన్య ప్రజల కోసం, ఆదివాసుల కోసం పోరాటం చేసిన బిడ్డ. ఇవాళ కేసీఆర్ ఆయన చేసిన సేవలను గుర్తించి.. ఆసిఫాబాద్లో కోవ లక్ష్మి గెలుపునకు మద్దతు ఇచ్చి విరమించుకున్న నాడే సక్కుకు పార్లమెంట్ టికెట్ ఇస్తా అని మాట ఇచ్చారన్నారు. చెప్పినట్లే టికెట్ ఇచ్చి మీ దగ్గరికి పంపారన్నారు. ఆయన చదువుకున్న విద్యావంతుడు, ఒక టీచర్ అన్ని అవగాహన ఉన్న నాయకుడు. పార్లమెంట్లో రేపు ఆదిలాబాద్ కోసం పోరాటం చేయగలిగే నాయకుడని చెప్పారు. ఇవాళ మూడు పార్టీలు కొట్లాడుతున్నయ్.. అందులో ఒకటి కాంగ్రెస్.. ఆ పార్టీపై ఈ నాలుగున్నర నెలల్లోనే ప్రజల్లో పూర్తిస్థాయిలో వ్యతిరేకత మొదలైందన్నారు. ఇంకో పార్టీ బీజేపీ పదేళ్ల కిందట మాయమాటలు చెప్పి ఆనాడు కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చిందన్నారు. కానీ.. ఈరోజు ఏ పని కూడా చేయలేదన్నారు. అందుకే చెప్తున్నా.. కేసీఆర్ ఉన్నప్పుడే తెలంగాణ బాగుండే అనే ఆలోచన ఉన్నవాల్లంతా ఒక్కసారి చేయి ఎత్తండి అని కేటీఆర్ పిలుపునివ్వగా అందరూ చేతులు ఎత్తారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునే వాళ్లంగా 13వ తారీఖున సక్కు కారు గుర్తు నంబర్ 1 మీద ఉన్నది.. తప్పకుండా కారు గుర్తు మీద ఒత్తాలని చెప్పారు.
జన బలం ఉన్నప్పుడు.. జనం మనతో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా ఏం చేయలేరని కేటీ ఆర్ అన్నారు. మీరు, కార్యకర్తలు గట్టిగా ఉన్నంత కా లం ఏం కాదన్నారు. తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ఉంటున్నారు. నిర్మల్ జిల్లా కాపాడుకోవాలన్నా.. రేపటి రోజుల్లో కేసీ ఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించాలన్నా.. బీఆర్ఎస్కు ఓటు వేయాలన్నారు. ఈ రోడ్ షోల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ముథోల్ నియోజకవర్గ పార్టీ సమన్వయ కర్తలు పడకంటి రమాదేవి, కిరణ్ కొమ్రేవార్, లోలం శాంసుందర్, విలాస్ గాదేవార్, నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జీ రాంకిషన్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఖానాపూర్ బీఆర్ఎస్ ఇన్చార్జి జాన్సన్ నాయక్ పాల్గొన్నారు.