మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 28: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సైన్స్ కేంద్రంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ యాదయ్య అధ్యక్షతన, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రణాళిక అధికారి జీ సత్యం హాజరయ్యారు. సర్.సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినూత్న పద్ధతిలో సైన్స్ అధికారి రసాయన చర్యలు ద్వారా జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జీ సత్యం మాట్లాడుతూ సర్ సీవీ రామన్ను స్ఫూర్తిగా తీసుకొని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. యాదయ్య మాట్లాడుతూ విద్యార్థుల్లో జిజ్ఞాసను పెంపొందించడానికి జిల్లా సైన్స్ కేంద్రం ఏర్పాటు చేశామని, 233 పాఠశాలల్లో దాదాపు 17090 మంది విద్యార్థులకు జిజ్ఞాస సంచార ప్రయోగశాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా సైన్స్ అధికారి మధుబాబు స్థానిక బాలికల పాఠశాల, బాలుర పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు ‘నూతన ఆవిషరణలు సమాజానికి ఉపయుక్తం’ అనే అంశంపై సెమినార్లు నిర్వహించారు. వినూత్నమైన నూతన ఆవిషరణలను విద్యార్థులకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల విద్యాధికారి జాడిపోచయ్య, డిప్యూటీ ఎస్వో రాజేందర్, సైన్స్ కేంద్ర ఇన్స్ట్రక్టర్ సాయి, సంపత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మంచిర్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్ డాక్టర్ వీ.చక్రపాణి అధ్యక్షతన నేషనల్ సైన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ అకాడమిక్ సైన్సెస్ (టీఏఎస్) తరఫున ప్రొఫెసర్ వీ.కిషన్ , స్పీకర్ గా ప్రొఫెసర్ వీ.ఎస్ రాజు వ్యవహరించారు. సైన్స్ పాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన డిబేట్, ఎలక్యూషన్, అండ్ క్విజ్ పోటీలలో విజయం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ ఎం కిశోర్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సీహెచ్ శ్రీనివాస్ , కే.ప్రేమలత, జాడి మహేశ్ కుమార్, వీ కరుణాకర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జన్నారం, ఫిబ్రవరి 28 : నేషనల్ సైన్స్ డే సందర్భంగా మండల కేంద్రంలోని స్లేట్స్ హైస్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్, రక్తదాన కార్యక్రమాన్ని స్లేట్ గ్రూప్ అఫ్ చైర్మన్ ఏనుగు శ్రీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సీఈవో అఫ్ అంతరిక్ష ఇండియా(హైదరాబాద్)ఇసాన్ దుబేతో పాటుగా తహసీల్దార్ రాజమనోహర్రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన 383 ప్రాజెక్టులను పరిశీలించి అభినందించారు.
కలమడుగు గ్రామంలో వివేకానంద పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, యాదగిరి స్వదేశిరావు, ఏ సతీశ్ వీక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రామ్మోహన్, ఆర్ఐ భాను చందర్నాయక్, స్లేట్స్ హైస్కూల్ వ్యవస్థాపకుడు ఏనుగు శ్రీకాంత్రెడ్డి, అడ్మినిస్ట్రేటర్ ఏనుగు రజితారెడ్డి, ప్రిన్సిపాల్ మరియా, ఉపాధ్యాయులు బచ్చలి కృష్ణ, రంజిత్, రాజన్న, రిజ్వాన్, భానుచందర్, విల్సన్ తదితరులు పాల్గొన్నారు.
కోటపల్లి, ఫిబ్రవరి 28 : కోటపల్లి మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ లక్ష్మారెడ్డి, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ హరిత, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో హెచ్ఎం లావణ్య, వార్డెన్ సుమలత ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. సైన్స్ ప్రాముఖ్యతను తెలుపుతూ కోటపల్లి కస్తూర్బా గాంధీ విద్యార్థులు వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి.
రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 28: జాతీయ సైన్స్ డే పురస్కరించుకొని రామకృష్ణాపూర్లోని తవక్కల్ ఉన్నత పాఠశాలలో తవక్కల్స్ స్కిల్ డేను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ తవక్కల్స్ స్కిల్ డేలో విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో కలిపి 300 వరకు ప్రాజెక్ట్స్ నమూనాలను తయారు చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ ఎస్ఐ జీ రాజశేఖర్, మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, తవక్కల్ విద్యా సంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్ హాజరై ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్ట్లను చూసి వారిని అభినించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ విద్యాసాగర్రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, నాయకులు గాండ్ల సమ్మయ్య, గోపతి రాజయ్య, అల్గుల సత్తయ్య, రామిడి కుమార్, మహంకాళి శ్రీనివాస్, పొలం సత్తయ్య, ఎర్రబెల్లి రాజేశ్, సత్యపాల్, పాఠశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
బెల్లంపల్లిరూరల్, ఫిబ్రవరి 28: సమాజానికి సైన్స్ ఉపాధ్యాయులు అత్యంత అవసరమని బెల్లంపల్లి సీవోఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు అన్నారు. కళాశాలలో సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. భౌతికశాస్త్ర పితామహుడు సీవీ రామన్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బయాలజీ, భౌతిక,రసాయనశాస్త్రం విభాగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
కాసిపేట బాలుర సంక్షేమ గురుకుల కళాశాలలో విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ఎగ్జిబిట్లు ఆకట్టుకున్నాయి. వారిని ప్రిన్సిపాల్ ఊటూరి సంతోష్కుమార్ అభినందించారు. క్విజ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ స్రవంతి, సైన్స్ ఉపాధ్యాయులు వాహిని, నీలిమ, తిరుపతి, విద్యార్థులు పాల్గొన్నారు.
కాసిపేట, ఫిబ్రవరి 28 : కాసిపేట మండలంలోని ముత్యంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ను ఎంపీడీవో సత్యనారాయణ సింగ్ ప్రారంభించారు. సైన్స్ ప్రదర్శనలను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో నాగరాజు, ఉపాధ్యాయులు బండ శాంకరి, జ్యోతి, పుష్పలత, పల్లె కృష్ణగోపాల్రావు, మాధవీ లత, అర్చన, విద్యార్థులు పాల్గొన్నారు.
దండేపల్లి, ఫిబ్రవరి28: దండేపల్లి మండల కేంద్రంతో పాటు వెల్గనూర్, కస్తూర్బా విద్యాలయం, ద్వారక జడ్పీ ఉన్నత పాఠశాలలో సైన్స్ పితామహుడు సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, సోలార్ వినియోగం, జీవ వైవిద్యం, సేంద్రియ వ్యవసాయం, తదితర అంశాలపై క్విజ్, వ్యాసరచన, ఉపన్యాస, ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి, ఫిబ్రవరి 28 :బెల్లంపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సైన్స్ దినోత్సవంలో ప్రిన్సిపాల్ టీఎస్. ప్రవీణ్కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
కాసిపేట, ఫిబ్రవరి 28 : కాసిపేటలోని తెలంగాణ మోడల్ స్కూల్లో విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టులను చూసి ఎంపీడీవో సత్యనారాయణ సింగ్, తహసీల్దార్ భోజన్న, ప్రిన్సిపాల్ అందె నాగ మల్లయ్య అభినందించి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కన్నెపల్లి, ఫిబ్రవరి 28 : కన్నెపల్లి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులకు సైన్స్పై వ్యాసరచన, రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రమేశ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చెన్నూర్ రూరల్, ఫిబ్రవరి 28: మండలంలో బుధవారం కిష్టంపేటలో డిగ్రీ కళాశాల, ఆస్నాద్ గ్రామంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, ఆస్నాద్ పాఠశాల హెచ్ఎం అనురాధ, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.