నిర్మల్ అర్బన్, అక్టోబర్ 31 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం, జిల్లా అటవీ శాఖ కార్యాలయాల్లో సర్ధార్ వల్లాభాయ్ పటేల్ జయంతి, జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, సీసీఎఫ్ శరవణన్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జాతీయ సమైక్యతకు పటేల్ చేసిన కృషిని వారు కొనియాడారు. కార్యక్రమంలో నిర్మల్ డీఎఫ్వో సునీల్ హేమామత్, ఆదిలాబాద్ డీఎఫ్వో రాజశేఖర్, జగిత్యాల డీఎఫ్వో వెంకటేశ్వర్ రావు, నిర్మల్ ఎఫ్డీవో రవీందర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కుమార స్వామి, ఎస్బీ సీసీ వెంకట రమణ, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ఎదులాపురం, అక్టోబర్31: ఆదిలాబాద్ జిల్లాలోని పోలీస్ కార్యాలయాల్లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు. అధికారులు, సిబ్బంది సమైక్యతా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, కార్యాలయం ఏవో యూనుస్ అలీ, సూపరింటెండెంట్ జోసెఫిన్, సీసీ దుర్గం శ్రీనివాస్, డీసీఆర్బీ సీఐ జే గుణవంతరావు, రిజర్వ్ సీఐ డీ వెంకటి, ఎం వంశీకృష్ణ, అడిషనల్ ఎస్పీ సీసీ గిన్నెల సత్యనారాయణ, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ రెండో బెటాలియన్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఆదిలాబాద్ జిల్లా కమాండెంట్ ఆర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ పీ కృష్ణప్రసాద్, రిజర్వ్ సీఐ, ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు. ఆదిలాబాద్లోని సంజయ్గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపాల్ పీ భరద్వాజ, సిబ్బంది, విద్యార్థులు పటేల్ చిత్రపటనికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో హెచ్వోడీలు, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.