ఆదిలాబాద్: ఆదివాసీలు ఎంతో పవిత్రంగా నిర్వహించుకునే నాగోబా జాతర ఈనెల 31 నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా గుడి ఉంది. ఈ గుడి జాతరను ప్రతి సంవత్సరం ఆదివాసీలు ఘనంగా నిర్వహిస్తారు.
ఇప్పటికే జాతర కోసం కేస్లాపూర్ గ్రామానికి మెస్రం వంశీయులు హస్తినమడుగుకు చేరుకున్నారు. ఈనెల 12న వాళ్లు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న హస్తినమడుగుకు చేరుకున్నారు. అక్కడ కలశాలు తీసుకొని ఈనెల 27లోగా ఇంద్రవెల్లికి చేరుకుంటారు. అక్కడ ఇంద్రాయి ఆలయంలో కలశాలను పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత గంగతో నింపిన ఆ కలశాలను తీసుకొచ్చి నాగోబా ఆలయం దగ్గర ఉన్న మూడు రోజుల పాటు ఉంచుతారు. ఆ తర్వాత జనవరి 31న అర్ధరాత్రి నుంచి జాతర ప్రారంభం అవుతుంది.
నాగోబా జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు రానున్న నేపథ్యంలో భక్తులంతా విధిగా కోవిడ్ నిబంధనలను పాటించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.