ముథోల్, జనవరి 20 : ముథోల్ను మున్సిపల్గా ఏర్పాటు చేసేలా చూడాలని పురపాలక పట్టణ అభివృద్ధి సమాచార, పౌర సంబంధాల శాఖ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్కు ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి స్పందించిన చీఫ్ సెక్రటరీ.. తక్షణమే ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీని ఆదేశించారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ముథోల్లోని స్థానిక పశుపతినాథ్ శివాలయం ఆవరణలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే, అసిస్టెంట్ కలెక్టర్ హేమంత్ బోర్కడేతో కలిసి పరిశీలించారు.
విచారణ కేంద్రం, కంటి పరీక్షల విధానాన్ని తనిఖీ చేశారు. కంటి జబ్బులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ మందులు, కంటి అద్దాలు అందజేయాలని సూచించారు. అంతకుముందు డిప్యూటీ కలెక్టర్ రాంబాబు కంటి వెలుగు కేంద్రాన్ని సందర్శించి అధికారులకు సూచనలు, సలహాలు అందజేశారు. ముథోల్కు వచ్చిన చీఫ్ సెక్రటరీని ఎమ్మెల్యేశాలువాతో ఘనంగా సత్కరించారు. ఈయన వెంట డిప్యూటీ డీఎం అండ్ హెచ్వో ఇద్రిజ్ గోరి, ఆర్డీవో రవి కుమార్, ముథోల్ తహసీల్దార్ శ్యాంసుందర్, ఎంపీడీవో సురేశ్ బాబు, సర్పంచ్ రాజేందర్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు తదితరులున్నారు.
బాసర, జనవరి 20 : బాసర సరస్వతీ అమ్మవారిని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అడిషనల్ కలెక్టర్ రాంబాబు, జాయింట్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈయన వెంట ఆలయ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసు సిబ్బంది ఉన్నారు.
బాసర ఆర్జీయూకేటీని మున్సిపల్ అడ్మినిస్ట్రేటీవ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సందర్శించారు. ఆర్జీయూకేటీలో 75 ఎకరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ట్రిపుల్ఐటీ ఇన్చార్జి వీసీ వెంకటరమణను వివరాలు అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ 10న ఆర్జీయూకేటీని మంత్రులు కేటీఆర్, ఐకేరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి సందర్శించగా.. వారి సూచనల మేరకు నిర్మల్ కలెక్టర్ ముషారఫ్అలీ ఫారూఖీతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ట్రిపుల్ఐటీ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎకో పార్క్కు సంబంధించిన పనుల గురించి ఆరా తీశారు. తదనంతరం ప్రాజెక్టు పనులను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం వీసీ వెంకటరమణ, స్పెషల్ చీఫ్ సెక్రటరీని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రిపుల్ఐటీ డైరెక్టర్ సతీశ్ కుమార్, అడిషనల్ కలెక్టర్లు రాంబాబు, హేమంత్ బోర్కడే, తహసీల్దార్ నారాయణ, మండల రెవెన్యూ సిబ్బంది, ఆర్జీయూకేటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ముథోల్, జనవరి 20 : నిరుపేదలకు అండగా సీఎం సహాయనిధి భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ సర్కార్ బాధితులకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు సురేశ్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు మగ్దుమ్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, సంజీవ్, ఆరిఫ్, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.