తానూర్, డిసెంబర్, 28 : బీఆర్ఎస్తోనే దేశాభివృద్ధి సాధ్యమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండంలోని వడ్ఝరి గ్రామంలో కొన్ని రోజుల క్రితం రైతు సాయినాథ్ అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆయన భార్య సాగరబాయికి మంజూరైన రూ.5 లక్షల రైతు బీమా చెక్కును బుధవారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు దేశంలోనే మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో 90 శాతం ఉన్న పేద వర్గాలకు సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు చంద్రకాంత్యాదవ్, మండల కోఆప్షన్ సభ్యుడు గోవింద్రావుపటేల్, తానూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు తాడేవార్ విఠల్, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్రెడ్డి, రోహిదాస్, నంద్గావ్ సర్పంచ్ అబ్దుల్ గనీ, ఎస్ఐ విక్రమ్, వ్యవసాయ అధికారి గణేశ్, వ్యవసాయ విస్తరణ అధికారి రమేశ్, బీఆర్ఎస్ మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
ముథోల్, డిసెంబర్ 28 : ముథోల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ముథోల్కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందడంతో రూ.3 లక్షల చెక్కును విద్యార్థి తల్లి భాస్కరోల్ల విజయలక్ష్మికి అందజేశారు. అనారోగ్యంతో బాధపడిన ముథోల్కు చెందిన కోలేకర్ అభినవ్ పిప్రికి చెందిన రూ.20 వేలు, విఠోలి గ్రామానికి చెందిన బ్రహ్మయ్యకు రూ.44 వేలు, ఆష్టా గ్రామానికి చెందిన ఒకరికి రూ.40 వేలు మంజూరు కాగా, చెక్కులను అందజేశారు.
అనంతరం ముథోల్లోని బాసర- ముథోల్ రోడ్డు పక్కన రూ.9 కోట్లతో నిర్మిస్తున్న 30 పడకల దవాఖాన భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పరిశీలించారు. పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అప్రోజ్ ఖాన్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఖాలీద్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు రాంరెడ్డి, విటోలి తండా సర్పంచ్ విజేశ్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రం మురళి, గౌతం, అశోక్ ఉన్నారు.
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
ముథోల్లోని అంబేద్కర్నగర్కు చెందిన హోంగార్డు ధర్మేంధర్ ఇటీవలే గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాంరెడ్డి, సర్పంచ్ విజేశ్, కోఆప్షన్ సభ్యుడు ఖాలీద్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, రవికిరణ్ గౌడ్, మురళి, అశోక్, గౌతమ్, తదితరులున్నారు.