తానూర్, మార్చి 2 : కేసీఆర్ సీఎం కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని ఏల్వత్ గ్రామంలో రూ 5 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు శనివారం భూమి పూజ చేశారు. అలాగే మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 29 మంది లబ్ధిదారులకు రూ 29,33,64 విలువైన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అనతికాలంలోనే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాదన్నారు. అలాగే గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు.
కార్యక్రమంలో హంగిర్గా సొసైటీ చైర్మన్ నారాయణ్రావు పటేల్, ఆత్మ చైర్మన్ పోతరెడ్డి, వైస్ ఎం పీపీ జెల్లావార్ చంద్రకాంత్, మాజీ ఎంపీపీ బా శెట్టి రాజన్న, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు తాడేవార్ విఠల్, మాజీ జట్పీటీసీ ఉత్తం బాలేరావ్, సొసైటీ ఉపాధ్యక్షుడు పసుల నాగ్నాథ్, మండల కోఆప్షన్ సభ్యుడు గోవింద్రావ్ పటేల్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు చంద్రకాంత్యాదవ్, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీవో శ్రీనివాస్రావు, ఎస్ఐ విక్రం, ఎంపీవో మోహన్సింగ్, ఆర్ ఐ గంగాధర్, సర్పంచ్లు, బొల్లిపెల్లి బాలాజీ, సంతోష్పటేల్, సాయినాథ్, జాదవ్ పుండ్లిక్, అ బ్దుల్ గనీ, శ్యాంపటేల్, సొసైటీ డైరెక్టర్లు, సంతోష్, మాజీ సర్పంచ్లు, బాబుపటేల్, ఉప సర్పంచ్, నయ్యూంఖాన్, బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్, పిప్పెర గోపాల్, చుక్కబొట్ల భోజన్న, పల్లె విఠల్, అఠల్ దేవీదాస్ కేశవ్, సాయినాథ్, సుభాష్, రాజారెడ్డి, దార్మోడ్ సుభాష్, ఖరీం, లబ్ధిదారులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ముథోల్, మార్చి, 2 : మండలంలోని బ్రహ్మణ్గాం గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మిస్తున్న నూతన గ్రామపంచాయతీ భవన పనులకు ఎమ్మె ల్యే విఠల్ రెడ్డి గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ హయంలోనే గ్రామాల్లో సౌకర్యాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాంరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అప్రోజ్ ఖాన్, ఎంపీటీసీ సునీత పోశెట్టి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డితో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.