భైంసాటౌన్, సెప్టెంబర్ 12 : జబ్బులతో బాధపడుతూ కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరమని ముథోల్ ఎమ్మె ల్యే విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని కామోల్ గ్రామానికి చెందిన జీ నర్సవ్వకు సీఎం సహాయనిధి నుంచి రూ.2 లక్షలు మంజూరయ్యాయి. ఈ చెక్కును ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మంగళవారం లబ్ధిదారుకు అందజేశారు. వివిధ జబ్బులతో బాధపడుతూ కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని పేదల కోసమే సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధిని ఏర్పాటు చేశారన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ పిప్పెర కృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ తోట రాము, పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యు డు గజానంద్, లింగా సర్పంచ్ దుప్పె గణేశ్, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ సాయినాథ్, ఎంపీటీసీ మాణిక్, బీఆర్ఎస్ నాయకులు అమేందర్ రెడ్డి, పోతన్న, మేరాజ్, అనిల్ పాల్గొన్నారు.
ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట
ముథోల్, సెప్టెంబర్ 12 : తెలంగాణ ప్రభు త్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ముథోల్లో రూ.20 లక్షలతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. త్వరలో బోరిగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి భవనం మంజూరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, వైద్యాధికారి ఆకాశ్, సర్పంచ్ రాజేందర్, మండల కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఖాలీద్, ఎంపీటీసీలు సరళ-శ్రీనివాస్ గౌడ్, భూమేశ్, నాయకులు రమేశ్, ఎర్రం మురళి, కిష్టయ్య, బషీర్, పోశెట్టి, సమీ, బాబురావు, విజేశ్ తదితరులు పాల్గొన్నారు.