కుంటాల, మే 3 : సీఎం కేసీఆర్తోనే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని ఓలా – రాజాపూర్ వరకు సుమారు రూ.1.16 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు మన రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. ఓలాలో సబ్స్టేషన్ నిర్మించి నాణ్యమైన కరెంట్ను రైతులకు సరిపడా అందిస్తున్నామన్నారు.
ముథోల్ నియోజకవర్గం మొత్తం చాలా దేవాలయాలు నిర్మించుకున్నామని, మన ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఓలా గ్రామంలో షాదీఖానా నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గంగామణి బుచ్చన్న, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్, నర్సాపూర్ వైస్ ఎంపీపీ సుధాకర్, సర్పంచ్ ఖనీష్ ఫాతిమా అహ్మద్ పాషా, రైతు బంధు సమితి అధ్యక్షుడు శంకర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు రమణాగౌడ్, సదాశివ్, రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, గణేశ్, ప్రవీణ్, దత్తు, రవి, పవార్ వసంత్, చౌహాన్ పండిత్, మండలంలోని సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్
లోకేశ్వరం, మే 3 : రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ముందుగా కేసీఆర్ చిత్రపటానికి మండల నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం మక్క కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు మ క్కను దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.1,962కు విక్రయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్ బాబు, ఎంపీపీ లలితాభోజన్న, సింగిల్ విండో చైర్మన్ రత్నాకర్ రావు, వైస్ ఎంపీపీ నారాయణ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరిపే శ్యాంసుందర్, సర్పంచ్ శేఖర్ రెడ్డి, ఎంపీటీసీ దత్తురాం పటేల్, నాయకులు మెండే శ్రీధర్, నాలం గంగాధర్, లక్ష్మణ్ రావు, బండి ప్రశాంత్ పాల్గొన్నారు.