అభివృద్ధే తమ ధ్యేయమని, ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడలో ఎమ్మెల్యే దివాకర్రావు, మున్సిపల్ పెంట రాజయ్యతో కలిసి రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. దండేపల్లి మండలం లక్ష్మీకాంతాపూర్లో రూ.22.50 లక్షలతో భక్తాంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. చింతపల్లిలోని కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. ఆయాచోట్ల వారు మాట్లాడుతూ గూడెం ఎత్తిపోతల నీటి విడుదల విషయంపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, గుండా రాజకీయాలకు భయపడేది లేదని స్పష్టంచేశారు.
మంచిర్యాలటౌన్, జనవరి 27: అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, గుండా రాజకీయాలకు భయపడనని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్నేత అన్నారు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని హమాలీవాడలో రూ. 2.80 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో వినాయక గుడి నుంచి గాంధీనగర్ వరకు, రూ. 5.85 కోట్లతో భాగ్యలక్ష్మి చికెన్ సెం టర్ నుంచి తిలక్నగర్ వరకు రోడ్డు విస్తరణ పనులకు ఎమ్మెల్యే దివాకర్రావు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్యతో కలిసి శుక్రవారం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ కౌన్సిలర్ పూదరి సునీత పేరును శంఖుస్థాపన బోర్డుపై పెట్టలేదని, అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని ఆ పార్టీ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు.
ఎంపీ, ఎమ్మెల్యే స్పం దించి అధికారులతో మాట్లాడి ప్రొటోకాల్ పాటించాలని సూచించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ మంచిర్యాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సరిపడా నిధులు కేటాయిస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ చాలా ఏళ్ల క్రితం నుంచి హమాలీవాడ రోడ్డును విస్తరించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారని, అందుకే అండర్బ్రిడ్జి నిర్మాణం పూర్తవ్వగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మున్సిపల్ వైస్చైర్మన్ ముఖేశ్గౌ డ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వసుంధర, కౌన్సిలర్లు నల్ల శంకర్, పోరెడ్డి రాజు, హరికృష్ణ, గాదె సత్యం, బోరిగం శ్రీ నివాస్, అంకం నరేశ్, శ్రీరాముల సుజాత, మోతె సుజాత, పీఏసీఎస్ చైర్మన్ సందెల వెంకటేశ్, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కంటివెలుగును వినియోగించుకోవాలి
దండేపల్లి, జనవరి 27 : కంటివెలుగును సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు సూచించారు. మండలంలోని చింతపెల్లి గ్రా మంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం సందర్శించారు. అనంతరం కంటి పరీక్షలు చేసుకున్న వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీ నివాస్, వైస్ ఎంపీపీ అనిల్, మాజీ వైస్ ఎం పీపీ ఆకుల రాజేందర్, సర్పంచ్ అక్కల దేవేంద్ర, ఉపసర్పంచ్ అక్కల తిరుపతి, బీఆర్ఎస్ నాయకులు చుంచు చందు, మధుకర్, మల్లేశ్, రవి, శేఖర్, నరేశ్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి కృషి
రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభు త్వం కృషి చేస్తున్నదని పెద్దపెల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్నేత, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. మండలంలోని లక్ష్మీకాంతాపూర్ గ్రా మంలో తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖ నిధులు రూ.22.50 లక్షలతో నిర్మించనున్న శ్రీభక్తాంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ చేశారు.కార్యక్రమంలో ఎంపీ పీ గడ్డం శ్రీనివాస్, నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ నడిపెల్లి విజిత్రావు, మంచిర్యాల ఏఎంసీ చైర్మన్ పల్లె భూమేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు చుంచు శ్రీనివాస్, బండారి వెంకటేశ్, వైస్ ఎంపీపీ అనిల్, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, స్థానిక సర్పంచ్ బాదినేని సత్యావతి, ఆలయ కమిటీ చైర్మన్ జాబు కాంతారావు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.